దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీది మితిమీరిన రాజకీయ ఆకాంక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశ ఆస్తులన్నీ అదాని, అంబానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. శనివారం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులోని నూతన మార్కెట్ యార్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ రవీందర్రావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని కాంగ్రెస్ తొమ్మిదేండ్లలో సరైన ప్రతిపక్ష హోదాను ప్రదర్శించకపోవడంతో బీజేపీకి వరంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ వనపర్తి ప్రగతి అద్భుతమని కితాబిచ్చారు.
– వనపర్తి రూరల్, ఏప్రిల్ 8
వనపర్తి రూరల్, ఏప్రిల్ 8 : దేశ రాజకీయాల్లో ప్ర ధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న మొనగాడు సీఎం కే సీఆర్ ఒక్కరేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్యాల గ్రామ శివారులో ఉన్న నూతన మార్కెట్ యార్డులో శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎ మ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి మంత్రి ని రంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందన్నారు. ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరిస్తామన్నారని, ఆ రైల్వేస్టేషన్ నుంచి ఏటా రూ.550 కోట్ల ఆదా యం వస్తుందన్నారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణకు కేంద్రం ఇచ్చేది ఏంటో చెప్పాలన్నారు. రహదారుల నిర్మించి.. టో ల్గేట్లతో ప్రజల తోలు తీస్తున్నారని మండిపడ్డారు. మో దీ మితిమీరిన రాజకీయ ఆకాంక్షతో అదానీ, అంబానీలకు ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారన్నారు. బీజేపి నేత అద్వానీని రాజకీయంగా కనుమరుగు చేసి మోదీ ఎదిగాడన్నా రు. తొమ్మిదేండ్లల్లో దేశంలో కాంగ్రెస్ సరైన ప్రతిపక్ష హో దా ప్రదర్శించకపోవడంతో బీజేపీకి బలం చేకూరిందన్నా రు.
ప్రాంతీయ పార్టీలతో వైరం పెట్టుకొని కాంగ్రెస్ వైభ వం కోల్పోయిందన్నారు. తెలంగాణలో బీజేపీకి అభ్యర్థు లే గతిలేరని, వారికి ఇక్కడ అధికారం కల్లగానే మిగిలిపోతుందన్నారు. సీఎం కేసీఆర్కు అపార రాజకీయ అనుభ వం ఉన్నదని, ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గ్రామ పంచాయతీ జాతీయస్థాయి అవార్డుల్లో అత్యధికంగా మనకే వచ్చాయన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో నీళ్లు, కరెంటు, రైతుబంధు, రైతుబీమా లేవన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. సీఎం ఆశీస్సులతో వనపర్తి అభివృద్ధి చెందుతుందన్నారు.
తొమ్మిదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని గడగడపకూ వివరించాలన్నారు. ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ వనపర్తి అద్భుతం గా అభివృద్ధి చెందిందని, అసాధారణ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందన్నారు. నిరంజన్రెడ్డి మీద ప్రజల అభిమానం వారి స్పందనలో తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆ ర్ నాయకత్వాన్ని దేశం ఆహ్వానిస్తుందన్నారు. అంతకుముందు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీని మంత్రి నిరంజన్రెడ్డి ప్రజలతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి సతీమణి సిం గిరెడ్డి వాసంతి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మ న్ శ్రీధర్, శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, గొర్రెల కాపరుల సం ఘం జిల్లా చైర్మన్ కురుమూర్తియాదవ్, నాయకులు పురుషోత్తంరెడ్డి, మాణిక్యం, వెంకట్రావు, కార్యకర్తలున్నారు.