వనపర్తి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంజే-4, ఖాన్ చెరువు, బుద్ధారం, ఘణపురం రిజర్వాయర్ల పనులకు వెంటనే టెండర్లు ఆహ్వానించాలన్నారు. అనంతపురం గ్రామానికి నీళ్లు ఇచ్చేందుకు ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి కొత్త కాలువ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ, నష్టపరిహారానికి వెంటనే అంచనాలు రూపొందించాలన్నారు. వీటిని ప్రభుత్వ అనుమతి కోసం నివేదించాల్సి ఉందన్నారు. సింహాద్రి చెరువు అలుగు, బండరావిపాకుల ఆర్అండ్ఆర్ సెంటర్ నుంచి వెళ్తున్న క్రమంలో ఆర్అండ్ఆర్ సెంటర్కు నీళ్లు రాకుండా కొత్త అలుగు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. చీఫ్ ఇంజినీర్ కార్యాలయ నిర్మాణానికి అంచనాలు తయా రు చేయాలని సూచించారు. పెద్దమందడి మండలంలో అవసరమైన చెరువుల మరమ్మతుకు కావాల్సిన చర్య లు తీసుకోవాలని కోరారు. చీఫ్ ఇంజినీర్ కార్యాలయ నిర్మాణానికి, చెరువుల మరమ్మతులకు కావాల్సిన చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈ మధుసూదన్రావు, డీ ఈలు వెంకట రమణమ్మ, మోహన్, ఏఈ భరత్, అధికారులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి..
వనపర్తి, అక్టోబర్ 12 : వనపర్తిలో జరుగుతున్న రో డ్ల విస్తరణ పనుల్లో వేగం పెంచి నెల రోజుల్లో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కా ర్యాలయంలో జెడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఏఈ భాస్కర్తో మంత్రి సమీక్ష నిర్వహించారు. రోడ్ల విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయి..? ఏ దశలో ఉన్నాయి..? విస్తరణలో భాగంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా..? వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తా నుంచి జమ్మిచెట్టు వరకు 40 ప్రాపర్టీలు ఉన్నాయని తెలిపారు. రోడ్ల విస్తరణలో భాగంగా కోల్పోయే వాటిని గుర్తించి యజమానులతో మాట్లాడి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డు పూర్తవుతందని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.