వనపర్తి, ఆగస్టు 6: స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవాలు అదిరేలా నిర్వహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ న్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 200ఏండ్లు అనేక సంఘాలు, వ్యక్తులు, ప్రజల పోరాటం ఫలించి దేశానికి స్వాతంత్య్రం లభించిందని, దేశంలోని ప్రజలందరూ రాజ్యాంగానికి లోబ డి పని చేయాలన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు జాతిపిత మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు.
ఈ నెల 8న హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ నాయకత్వాన సమావేశం, 9వ తేదీన జాతీయ జెండాల పంపిణీ, 10న మొక్కలు నాటే కార్యక్రమం, 11న సామూహిక రక్షాబంధన్ కార్యక్రమం, రాజ్యాంగ పరిరక్షణ బంధన్గా అందరూ పాల్గొనాలని, 13న వివిధ వర్గాల ర్యాలీ, 14న నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారులతో కళారూపాల ప్రదర్శన, బాణాసంచా కాల్చే కార్యక్రమం, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న సామూహిక తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, 17న రక్తదాన శిబిరాలు, కవి సమ్మేళనాలు, 18న వివిధ రకా ల ఆటలపోటీలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా 19వ తేదీన అనాథ ఆశ్రమాలు, దవాఖానల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయాలని, 20న శాసనసభ ప్రత్యే క సమావేశం ఉంటుందని, అదేరోజు అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని, హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్ర మం ఉంటుందన్నారు. గ్రామాలు యూనిట్గా కార్యక్రమాలను నిర్వహించాలని, యువత, మహిళలు, వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని స్వాతం త్య్ర పోరాటంపై ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
జయశంకర్ పాత్ర స్ఫూర్తిదాయకం
ఆచార్య జయశంకర్ ఆకాంక్ష తెలంగాణ అని, స్వరాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని మంత్రి గుర్తుచేశారు. ఆచార్య జయశంకర్ సారు జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీకుంట వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు లక్ష్మీకుంట వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, అదనపు కలెక్టర్లు ఆశిష్సంగ్వాన్, వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.