కల్వకుర్తి/ఆమనగల్లు, నవంబర్ 4 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్ర పురపాలక, శాఖ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆమనగల్లులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభకు దాదాపు 50 వేల మందిని సమీకరించే ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. శనివారం సాయం త్రం బహిరంగ ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరిశీలించా రు. బహిరంగ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశ నిర్థేశం చేశారు.
భారీగా చేరికలకు ఏర్పాట్లు
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా నిర్వహించే భారీ బహిరంగసభ ప్రారంభానికి గంట ముందుగానే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమనగల్లు చేరుకుంటారు. ఆమనగల్లు సమీపంలోని విఠాయిపల్లి వద్ద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని 7 మండలాల్లో వివిధ పార్టీలలో కొనసాగుతున్న నాయకులు కార్యకర్తలు దాదాపు వెయ్యిమంది ఎమ్మెల్యే నేతృత్వంలో మంత్రి కేటీఆర్ సమక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
దివ్యాంగులను ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ
దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ఆలేటి నారాయణ పంక్షన్ హా ల్ ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, మాడ్గుల మండలాలకు చెందిన 3 వేల మంది దివ్యాంగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్యాదవ్ మాట్లాడుతూ దివ్యాంగులకు సీఎం కేసీఆర్ వారి జనాభా ప్రతిపాదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులకు రాష్ట్ర బడ్జేట్లో 5శాతం కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో 500 గజాల స్థలాన్ని కేటాయించి రూ. 25లక్షలతో భవన నిర్మాణం చేపడుతామని హమీ ఇచ్చారు. అనంతరం ముర్తుజపల్లి, తలకొండలపల్లి మండలం లింగరావుపల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో దివ్యాంగు ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లి కార్జున్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తోట గిరియాదవ్ ఉన్నారు.