‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది.. ప్రతిపక్షాల నేతలు కోర్టుల్లో ఎన్ని కేసులు వేసినా.. వాటిని పరిష్కరించుకొని వాయువేగంతో పనులు చేపడు తున్నాం.. ఎత్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లలోకి కృష్ణా జలాలను పారిస్తాం.. సెప్టెంబర్ నాటికి కరివెన రిజర్వాయర్ నింపుతాం.. మరో రెండు, మూడ్నెళ్లలోనే ఉదండాపూర్కు పారిస్తాం’.. అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల పట్టణంలో రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. మూసాపేట మండలం వేముల వద్ద రూ.500 కోట్లతో నిర్మించనున్న ఎస్జీడీ కార్నింగ్ కంపెనీ యూనిట్-2కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎర్రగుట్టలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గిరిజన తండాల్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో సరఫరా అయ్యే మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు.
మహబూబ్నగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను కృష్ణా జలాల తో నింపుతామన్నారు. గురువారం జడ్చర్ల పట్టణం లో రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌ డ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రగుట్టలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను కృష్ణా నది జలాలతో నింపేందుకు కృషి చేస్తున్న మాట వా స్తవం కాదా..? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఐదు దశాబ్దా లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సాగునీటి మీద సోయే లేదని వి మర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక వాయువేగంతో పూర్తి చేస్తున్నామన్నారు. కోర్టుల్లో కేసులు వేసి పనులను ఎన్నో సార్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, అటు కేంద్రంలోని బీ జేపోళ్లు కృష్ణానది జలాలను పంచకపోయినా మనం ఇయ్యాల వేగంగా ప్రాజెక్టు పనులను చేసుకుంటున్నామని తెలిపారు. ఈ ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి కరివెన ప్రాజెక్టు నింపేందుకు చ ర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత రెండు, మూడు నెలల్లో ఉదండాపూర్ను నింపి జడ్చర్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామ లం చేసి తీరుతామని స్పష్టం చేశారు. చెరువులను బాగు చేసిన మాట వాస్తవం కాదా.. ఉదండాపూర్ రిజర్వాయర్, కరివెన రి జర్వాయర్ పనులు 90 శాతం పూర్తయిన మాట వాస్తవం కా దా.. అని ప్రశ్నించారు. జడ్చర్లలోని బంజారా తండాల్లో హైదరాబాద్లోని బంజారహిల్స్లో వస్తున్న నీళ్లు ఇక్కడి తండాల్లో వస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహబూబ్నగర్ పట్టణంలో గతంలో తాగునీటికి గోస ఉండేదని, 14 రో జులకోసారి మంచినీరు సరఫరా అయ్యేదని గుర్తు చేశారు. ఇక జడ్చర్ల పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసని మంత్రి అన్నారు. పట్టణాల్లోగానీ, పల్లెటూళ్లల్లో గానీ ఎండాకాలం వచ్చిందంటే భయం అ యితుండే.. వేసవి వచ్చిందా.. ఎమ్మెల్యేలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు భయం ఉంటుండే.. ఊళ్లకు పోవాలన్నా బిందెలు అడ్డం పెడతారో.. బోరింగ్లు అడుగుతారోనని, మోటార్లు అడుగుతారో అన్న భయం ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినంక మిషన్ భగీరథ కడుపునిండా నీళ్లు వస్తున్నాయని తెలిపారు.
జడ్చర్ల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జడ్చర్ల రోజురోజుకూ పెరుగుతున్నదని, స మీపంలోని మహబూబ్నగర్ వరకు పట్టణం విస్తరిస్తున్నది.. దీంతో జనాభా బాగా పెరిగిందని నిధులు కేటాయించాలని ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి కోరడంతో మంత్రి వెంటనే స్పందించారు. అలాగే గ్రేడ్వన్ మున్సిపాలిటీ చేస్తామని ప్రకటించారు. జడ్చర్లలో ఆసరా పింఛన్లతో ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడ్తున్నామన్నారు. ఒక్క నియోజకవర్గంలో రైతుబంధు కిం ద 88,591 మంది రైతులకు రూ.9,76,22,135 పడుతున్నాయని తెలిపారు. జడ్చర్ల నియెజకవర్గంలో రైతుబీమా కింద 14 33 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు వారం పది రోజుల్లో ఖాతాల్లో వేసిన ప్రభుత్వం మాదన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి సాయం చేస్తున్నామన్నారు. పెండ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి సూడు అనే సామెత ఉన్నది.. మీ లక్ష్మారెడ్డి జడ్చర్లలో పెండ్లిళ్లు చేస్తున్నడు.. ఇండ్లు కడ్తున్నడని కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో 8,550 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద ఒక్కో పెండ్లికి రూ.లక్ష నూటపదహారు అందించామన్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల పండుగ సందర్భంగా చెరువుల వద్ద సంబురాలు చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. చెరువుల పండుగ రోజు మృగశిర కార్తె జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హెలికాప్టర్లో వస్తుంటే ఎర్రటి ఎండలో కూడా చెరువులన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయని తెలిపారు. మిడ్జిల్ మండలంలో దుందుభీ వాగుపై ఆరు చెక్ డ్యామ్లు కట్టి అదనంగా ఐదువేల ఎకరాలకు నీళ్లిచ్చినం అన్నారు. సంతోషకరమైన వాతావరణంలో చెరువుల పండుగ చేసుకుంటుంటే 15 రోజుల కిందట కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర అంటూ తిరుగుతూ ఇక్కడకు వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చి లక్ష్మారెడ్డిని తిట్టారు.. జడ్చర్లలో అభివృద్ధి కనబడ్తలేదంటా.. వారు కండ్లున్న.. కబోదులని అన్నారు. ఇది వరకు ఇట్లే తిడితే మీరంతా లక్ష్మారెడ్డికి 45వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు.. ఈసారి వాళ్ల తిట్లను పట్టించుకోకుండా 90వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు
పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో లక్ష్మన్నను 90వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటిదూల ఎక్కువ.. వాళ్లు ఎన్ని తిట్లు తిట్టినా ఈసారి 90వేల ఓట్ల మెజార్టీతో ల క్ష్మారెడ్డిని గెలిపించి వారికి సమాధానం చెప్పాలని పి లుపునిచ్చారు. జడ్చర్ల నియోజకవర్గంలోని 88, 591మంది రైతులకు రైతుబంధు ఇవ్వగా 1,433 కుటుంబాలకు రైతుబీమా అందిందన్నారు. నియోజకవర్గంలో అన్నివిధాలా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ అధ్యక్షుడి కండ్లకు కనిపిస్తలేదా అని ఎద్దేవా చేశారు. లక్ష్మారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. లక్ష్మారెడ్డి కోరిక మేర కు మున్సిపాలిటీని గ్రేడ్-1గా చేస్తాన ని, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలోనే దమ్మున్న సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి హాజరైన మంత్రి బహిరంగ సభలో ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2024లో కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను దేశమంతా కోరుకుంటోందన్నారు. ఆరు నెలలైతే తామూ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వారంలో రెండ్రోజులు కరెంటు ఇచ్చిన ఘనత వారిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మొద్దని సూచించారు. దేశంలో అన్ని ధరలు పెంచి మోదీ పిరం ప్రధానమంత్రి అయ్యారన్నారు. విదేశీ విద్య కోసం రూ.20లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలన్నారు.
70 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడొచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2వేలకు బదులు రూ.200 పింఛన్.. 24 గంటల కరెంట్కు బ దులు 3గంటలు ఇస్తరు.. సీఎం కేసీఆర్ ఇస్తు న్న పథకాలన్నీ పోతయ్. రైతుబంధు, రైతుబీమా పొగొడ్తరు. పక్క రాష్ర్టాన్ని పాలిస్తూ వా రికే ఏమీ ఇవ్వలేని వారు.. ఇక్కడొచ్చి ఏమిస్తా రు” అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. వారి హయాంలో స్కూళ్లు హాస్టళ్లలో దొడ్డు బి య్యం తినలేక పిల్లలు ఏడుస్తుండేవారని గుర్తు చేశారు. రూ.2వేల పింఛన్ తీసుకునే వృద్ధులు సంతోషంగా ఉన్నారని.. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులందరూ కేసీఆర్ను చల్లగా ఉండాలని దీవిస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశా లు పెరుగుతాయన్నారు. భావితరాల కోసం అందరం కలిసికట్టుగా ఉమ్మడి జిల్లాలో 14 ని యోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చినంక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెసోళ్ల కండ్లకు కనిపిస్తలే దా అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రశ్నించా రు. వారికి కంటి వెలుగులో శస్త్రచికిత్స చేయిద్దామన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే పోటీలోనే ఉండనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో జడ్చర్ల నియోజకవర్గంలోని 70శాతం గ్రామాల్లో రోడ్లు లేవన్నారు. జడ్చర్లకు పరిశ్రమలు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు భూముల ధరలు కూడా పెరిగాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్లలో జనాభా 40వేల నుంచి లక్ష దాటిందన్నారు. కేవలం జడ్చర్ల మండలంలోనే రెండువేల డబుల్బెడ్రూం ఇండ్లను ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బాగుంటే నియోజకవర్గం.. సీఎం మంచిగుంటే రాష్ట్రం రూపురేఖలే మారుతాయన్నారు. ఏనాడూ పనిచేయని కాంగ్రెస్ సన్నాసులు తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి ఎవరు చేశారో వచ్చే ఎన్నికల్లో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు.