భూత్పూర్, మే 21 : మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూన్ 4న భూత్పూర్లో నిర్వహించను న్న బహిరంగసభను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌ డ్ కోరారు. స్థానిక వికాస్ సీడ్స్లో ప్రాంగణంలో శనివారం నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. జన సమీకరణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నా రు. సమావేశంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.