పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డు‘కాలమే’ వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు చీకటి బతుకులు తప్పా వేరేదారి ఉండదన్నారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ధరణి తీసేసి భూమాతలో కాలం విధానం పెడుతామంటున్నారని.. అలా చేస్తే రైతులు, కౌలుదారులకు కష్టాలే అని అన్నారు. కరెంట్ ఎక్కడ వస్తుంది.. నాకు ఎక్క డా కనిపిస్తలేదని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడు.. ఆయనకు దమ్ముంటే కరెంటు వైర్లను ముట్టుకొని చూడాలని సవాల్ విసిరారు. కర్ణాటకలో అధికారమిచ్చిన ఆరు నెలలకే రైతుల నోట్లో మట్టి కొట్టి కరెంట్ ఇవ్వక చే తులు కట్టేశారని ధ్వజమెత్తారు. గ్యారెంటీలన్నీ అటకెక్కాయన్నా రు. కర్ణాటక పరిస్థితి మనకు వద్దనుకుంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని గడ ప లేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ సర్కారే వస్తుందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుడుతారన్నారు. అసైన్డ్, పట్టా భూములు ఉన్న వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తామని మంత్రి వివరించారు.
మహబూబ్నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? మళ్లీ చీకటి ఇందిరమ్మ రాజ్యం కావాలా..? అనేది తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డు కాలమే వస్తుందని, ధరణి తీసేసి కాలం విధానం ప్రవేశపెడితే బతుకులు ఆగమవుతాయన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ గురువారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్లో మంత్రి మాట్లాడుతూ గాడిదలకు గడ్డి ఏసి ఆవులకు పాలు పిండితే వస్తాయా..? ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే కాస్తాయా..? కాంగ్రెసోళ్లకు ఓటేస్తే పనులవుతాయా..? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ కొన్ని ఎన్నో మంచి పనులు చేసిండు.. వాస్తవమా..? కాదా? ఆసరా పింఛన్లు ఇచ్చింది ఎవరు.. కల్యాణలక్ష్మి తెచ్చింది ఎవరు.. రైతుబంధు తెచ్చింది ఎవరు.. కేసీఆర్ కిట్లు ఇచ్చింది ఎవరు.. తండాలను పంచాయతీలు చేసింది ఎవరు.. రైతుబీమా ఇచ్చింది ఎవరు.. షాదీ ముబారక్ స్కీం పెట్టింది ఎవరు..? సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
ఇన్ని మంచి పనులు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే.. మాకేం చేస్తున్నారని కొంతమంది ఆడబిడ్డలు అడుగుతున్నారు. మా అత్తలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారు..? మాకు ఏమిస్తారని ఆలోచిస్తున్నారు..? నిజమా కాదా..? అని మహిళలను అడిగారు. డిసెంబర్ 3న మన రామన్న గెలిచిన తరువాత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలందరికీ సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల భృతిని అందజేస్తామన్నారు. దీంతోపాటు మరో నాలుగు కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. 2014లో ప్రధాని మోదీ గద్దె నెక్కేటప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 చేస్తానని మా ట ఇచ్చి నేడు ధరలు పెంచుతూ మన వీపుల మీద గుద్దుతున్నాడన్నారు. రూ.వెయ్యికి గ్యాస్ ధర చేరిం దన్నారు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తరువాత అర్హులకు రూ.400కే సిలిండర్ అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి మళ్లీ కొత్త కార్డులు అందజేసి.. తెల్లరేషన్ కార్డులు ఉన్నోళ్లందరికీ జనవరి నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. భూమి ఉన్నోళ్లకే బీమా ఇస్తున్నారు..? మరి లేనోళ్ల సంగతి ఏందని ప్రజలు అడుగుతున్నారు.. తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా పేరిట రూ.ఐదు లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.
అసైన్డ్ భూములు, పట్టా భూములు ఉన్న వారికి సంపూర్ణ హక్కులు ఇస్తామన్నారు. మేమేం చేశాం.. గెలిచాక ఏం చేస్తామనేది కూడా వివరిస్తామన్నారు. అలాంటి ధైర్యం బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. ‘మూడు గంటల కరెంట్ బదులు కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు.. 10 హెచ్పీ మోటర్లు మూడు గంటల్లో మూ డు ఎకరాలకు పారుతది..’ అంటూ రేవంత్రెడ్డి చె బుతున్నాడన్నారు. 10 హెచ్పీ మోటర్లు ఎవరికైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. ఎవరికీ లేవంటూ రోడ్షోకు వచ్చిన వారు తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కరెంటు వైర్లను ముట్టుకొని చూడాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలకు ఏసీ బస్సులు పెడతాను.. వెంకట్రెడ్డి లేదా రే వంత్రెడ్డి వచ్చి మక్తల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్లి కరెంట్ వైర్లను ముట్టుకొని రావాలన్నారు. కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని.. వారి హయాంలో కరెంటు సరిగా లేక కాలిపోయిన మోటర్లు.. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, రాత్రిపూట పొలాల వద్ద జాగరం చేసింది మరచిపోదామా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే కరువు కాటకాలు, గంజి కేంద్రాలు, నక్సలైట్ల ఎన్కౌంటర్లు అని గుర్తుచేశారు. ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి క్యూ లైన్లలో అమ్మేవారన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకకు ఇక్కడి నుంచి మూడు బస్సులు పెడతాను..మీరందరూ పోయి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చూసి రావాలని కోరారు. అధికారమిచ్చిన ఆరు నెలలకే రైతుల నోట్లో మట్టి కొట్టి కరెంటు ఇవ్వక చేతులు కట్టేశారని.. గ్యారెంటీలన్నీ అటక్కెంచారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చి ఇప్పుడేమో రూ.4000 ఇస్తామంటున్నారు.. ఇది చూస్తుంటే ‘అమ్మకు గాజులు పెట్టనోడు..
పిన్నికి బంగారు గాజులు పెడతాడంట’ సామెతను తలపిస్తున్నదన్నారు. రేవంత్రెడ్డి ఏమో మూడు గంటల కరెంటు చాలా అంటున్నాడు.. ఉత్తమ్కుమార్రెడ్డి ఏమో రైతుబంధు వేస్ట్ అంటున్నాడని, 24 గంటల కరెంట్, రైతుబంధు కావాలంటే బీఆర్ఎస్కు.. వద్దనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పారు. రైతుబంధును ఎత్తేద్దాం అని ఒకరంటుంటే.. రూ.16 వేలు ఇస్తామని మరొకరు అంటున్నారని.. వారిలో వారికే క్లారిటీ లేదని మండిపడ్డారు. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు.. కాంగ్రెస్ ఉంటే కరెంటు అసలే ఉండదని.. ఇది పక్కా అని అన్నారు. భట్టి విక్రమార్క ఏమో ధరణి తీసేస్తా.. మళ్లీ పాత పట్వారీ వ్యవస్థ తీసుకొస్తా అని అంటున్నాడు.. మల్లా కావాలనా పట్వారీ వ్యవస్థ? మల్లా దళారులు కావాల్నా.. లంచగొండులు కావాల్నా.. అని ప్రశ్నించారు..? ఇవాళ ధరణిలో మొత్తం అధికారం మీ చేతిలో ఉంది.. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు కానీ.. ఎలుకలు ఉన్నాయని ఇల్లు కాల పెట్టుకోలేము కదా? అన్నారు. మంచి పనులు చేసిన ప్రభుత్వం, మంచినీళ్లు ఇచ్చిన ప్రభుత్వం, సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం. కల్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రభుత్వం, రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, గ్రామాల్లో బ్రహ్మాండంగా మంచి పనులు చేసిన ప్రభుత్వం.. మనదన్నారు. మంచి ఎమ్మెల్యేగా చిట్టెం రామ్మోహన్రెడ్డి ఉన్నారని, ఈయన వైపు కాకుండా వేరే వేపు చూస్తే మనమే నష్టపోతామన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు.. ఆ పార్టీకి 11 సార్లు అధికారం ఇచ్చామని, మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటుందని విమర్శించారు. గతంలో వారి పాలన తెలిసిందే.. కారు గుర్తుకు ఓటేసి మళ్లీ అభివృద్ధికి సహక రించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా నాయ కురాలు సుచరితారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మక్తల్ ఇన్చార్జి ఆంజనేయగౌడ్, నాయకులు శ్రీనివాస్ గుప్తా, మహిపాల్ రెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్ షోకు హాజరైన కార్యకర్తలు, ప్రజల ఉత్సాహం చూస్తుంటే చిట్టెం రామ్మోహన్రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమైందని ఎమ్మెల్యే చిట్టెం సతీమణి సుచరిత అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి చిట్టెంను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇక్కడ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తుందన్నారు. వారికి ఓటేస్తే నష్టపోతామన్నారు. రోడ్ షో సక్సెస్కు సహకరించిన కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఊట్కూర్, (మక్తల్) నవంబర్ 23 : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మక్తల్తోపాటు ఆత్మకూర్, అమరచింత పట్టణాలను మున్సిపాలిటీలుగా చేసుకున్నామన్నారు. మరోమారు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఆత్మకూర్లో వంద పడకల దవాఖాన, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో స్టేడియంల నిర్మాణం, చంద్రగఢ్ కోటకు పర్యాటక శోభ, భూత్పూర్ రిజర్వాయర్ కాల్వల నిర్మాణం, మక్తల్ నుంచి నారాయణపేటకు ఫోర్లైన్ నిర్మిస్తామన్నారు. మక్తల్ ఉర్దూ మీడియం పాఠశాలకు నూతన బిల్డింగ్, ఊట్కూర్లో అధునాతన బస్టాండ్, ఎస్సీ, బీసీ, మైనార్టీ, తండాల పంచాయతీలకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలకు ప్రజలు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.