నాగర్కర్నూల్, జనవరి 31 : మనిషి ఆరోగ్యం గా ఉండేందుకు పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాని కి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండడానికి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కనీస వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు పోలీస్ అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మని షి ఆరోగ్యంగా ఉంటే మెదడు బాగా పనిచేస్తుందని తద్వారా మంచి విజయాలు సాధించవచ్చని తెలిపారు. ప్రతిగ్రామంలో క్రీడామైదానాలను ఏర్పాటు చేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సైనికులు ప్రతినిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటారని, అకుంటిత కార్యదీక్ష వల్ల ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే చేరుకొని పరిష్కరిస్తారని పోలీస్ సేవలను మంత్రి కొనియాడారు.
పోలీస్ స్పోర్ట్స్మీట్ పెట్టినందుకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ను మంత్రి అభినందించారు. ఆటల్లో ఆసక్తి ప్రతిభ ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఒలింపిక్లో పాల్గొనే స్థాయికి ఎదగాలని, అందుకు తనవంతు సహకా రం అందిస్తానని తెలిపారు. పోలీస్శాఖ మాత్రమే కాకుండా ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు వ్యాయామం, ఆటల పోటీల్లో పాల్గొనే లా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పోలీస్ స్పోర్ట్స్మీట్ జరగడం ఇదే తొలిసారి కావడంతో ఎస్పీని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఇతర శాఖల సిబ్బంది క్రీడల్లో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పాలుపంచుకున్న పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ మోహన్కుమార్, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్సై మహేందర్తోపాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నంబావి, జనవరి 31 : ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి జూపల్లి అన్నారు. మండలంలోని బెక్కెం, గడ్డబస్వాపురం లో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గాంధీజీ కలలు గ న్న స్వరాజ్యం దిశగా ముందుకుసాగుతుందని అం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొ ల్లాపూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో గ్రామ పం చాయతీ భవనాలను నిర్మించి సమగ్రాభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. సర్పంచులు ఐదేండ్ల పాటు గ్రామాల్లో చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్, సర్పంచులు సత్యరాణి, పద్మ, రంజిత్కుమార్, వైస్ ఎంపీపీ పుష్పలత, కాంగ్రెస్ నాయకులు చిదంబరరెడ్డి, ఈదన్న, రాంచంద్రారెడ్డి, బీ చుపల్లియాదవ్, ఉమేశ్నాయుడు, ఎంపీవో రామస్వామి, ఉప సర్పంచ్ మాధవి, ఇంద్ర ఉన్నారు.