మక్తల్/మక్తల్ టౌన్, అక్టోబర్ 4 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలువురు లబ్ధిదారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. దళితబంధు చెక్కులను జుట్ల సాగర్, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, జుట్ల మారుతి, జగ్గలి కొండయ్యకు ఎమ్మెల్యేలు చిట్టెం, రాజేందర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. అలాగే ఉప్పరి లక్ష్మయ్య, చిట్టెమ్మ, విజయ్కుమార్, చంద్రశేఖర్, గోవిందుకు బీసీబంధు చెక్కులు, అలాగే మహమూద్, అబ్దుల్ సమద్, మహ్మద్ అన్సీఫ్ మజర్, తసీన్కు మైనార్టీ బంధు చెక్కులతోపాటు 200 మందికి గృహలక్ష్మి పథకం ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజినీ సాయిచంద్, జెడ్పీ చైర్పర్సన్ వనజ, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా, ఎంపీపీ వనజ, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, రమేశ్ ముదిరాజ్, రవి యాదవ్, విజయ్గౌడ్, రాజేశ్గౌడ్, నాయకులు ఉన్నారు.
ప్రజల మనిషి చిట్టెం.. : ఎంపీ మన్నె
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రజల మనిషిగా నియోజకవర్గంలో పేరుపొందారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో చిట్టెంను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని తెలిపారు. దేశంలోనే నెంబర్వన్గా మారిందన్నారు. మన పథకాలు ఆదర్శంగా నిలిచి పక్క రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
కేసీఆర్తోనే అభివృద్ధి : గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని
సీఎం కేసీఆర్తోనే పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజినీ సాయిచంద్ అన్నారు. వలసలు, కరువు నుంచి ఉమ్మడి జిల్లా విముక్తి పొందిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో జిల్లా కరువుతో విలవిలలాడిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాకే అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామన్నను భారీ మెజార్టీతో గెలిపించి గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు.