దేవరకద్ర, ఆగస్టు 4 : దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నేరవేరింది. నియోజకవర్గానికి నూతనంగా 100 పడకల దవాఖాన మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దేవరకద్రకు 100 పడకల దవాఖాన మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరగా, ఆయన వెంటనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు సూచించారన్నారు. దీంతో మంత్రి హరీశ్రావు నియోజకవర్గానికి 100 పడకల దవాఖాన మంజూరు చేసి.. నిర్మాణానికి రూ.35కోట్లు ప్రకటిస్తూ జీవో జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల, మంత్రి హరీశ్రావును కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గకేంద్రంలో వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.