వైద్యశాఖ మంత్రి హరీశ్రావు
నాగర్కర్నూల్/జడ్చర్ల, జూన్ 14: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సేవలు అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో అత్యధికంగా రక్తదానానికి కృషి చేసిన వారిని అభినందిస్తూ అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లోనూ తన జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే మర్రిని మంత్రి తన్నీరు హరీశ్రావు శాలువాతో సత్కరించి ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. వివిధ సందర్భాల్లోనూ ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి మొత్తం 3,550 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వానికి అందజేయడంపై ప్రశంసిస్తూ అవార్డును అందజేశారు. అదేవిధంగా తన జన్మదినం సందర్భంగా 18ఏండ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు రక్తదానం చేయడంపై జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు అందజేసి శాలువాతో సత్కరించారు.