జడ్చర్ల, మే 26 : జడ్చర్లకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించనున్నారు.
దవాఖానలో ఐసీయూ, చిన్న పిల్లల వార్డులు, అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. కాగా మంత్రి పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పాలమూరులో మెరుగైన వైద్యం అందనున్నాయని తెలిపారు. ప్రారంభోత్సవం రోజు నుంచే దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.