నాగర్కర్నూల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గత వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు కళ తప్పా యి. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నీటిమట్టాలు కనిష్ఠ స్థా యికి చేరాయి. ఫలితంగా ఈసారి వేసవి రాక ముందే గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సమస్య ఎదురుకానున్నది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాతోపా టు వికారాబాద్, రంగారెడ్డి పరిధిలోని 19 మున్సిపాల్టీలు, 4,427 గ్రామాలకు మంచినీటి కష్టాలు తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రజల మంచినీటి కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2016 ఆగస్టులో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఫలితంగా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలం ఉచితంగా అందించింది. రెండేండ్ల కిందట ఒకసారి మి షన్ భగీరథకు నీటి సమస్య ఎదురైనప్పటికీ రివర్స్ పం పింగ్ ద్వారా అధికారులు సరిదిద్దారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్ను కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో ఎంజీకేఎల్ఐ కోసం నిర్మించిన రిజర్వాయర్కు తరలించడం ద్వారా తాగునీటి సమస్య తలెత్తకుండా చూ శారు. తిరిగి ఈ సంవత్సరం మరోసారి మంచినీటి సమ స్య ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే చాలా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య ఎదురవుతున్నది. రెండు, మూడు రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. వ చ్చే ఎండాకాలం నాటికి తాగునీటి సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉన్నదని మున్సిపల్, పంచాయతీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో 815 అడుగు ల వరకు నీళ్లు ఉంటే తాగునీటికి ఇబ్బంది ఉండదు. ప్ర స్తుతం 831 అడుగుల నీటి నిల్వ ఉన్నది. అయితే, శ్రీ శైలం రిజర్వాయర్ నుంచి ఎంజీకేఎల్ఐకి 1,600 క్యూ సెక్కులు, శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి కోసం 2,685 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కుల చొప్పు న నీటిని విడుదల చేస్తున్నారు.
ఇలా రోజూ 5,705 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం నుంచి బయటికి వెళ్తున్నాయి. దీంతో మిషన్ భగీరథ అవసరాలకు ప్రమాద ఘంటిక లు మోగుతున్నాయి. ప్రస్తుతం మిషన్ భగీరథకు నీళ్లు అందించే నార్లాపూర్(ఎంజీకేఎల్ఐ) రిజర్వాయర్ సా మర్థ్యం 0.35 టీఎంసీలు. కాగా పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ప్రారంభించిన నార్లాపూర్, అంజనగిరి రిజర్వాయర్ సామర్థ్యం 6.51 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథకు మంచినీటి సమస్యను తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 140 కోట్లతో కాల్వ పనులు కొనసాగుతున్నాయి. కానీ, కృష్ణానదిలో నీటి నిల్వలు లేకపోవడంతో నార్లాపూర్ రిజర్వాయర్పైనే మిషన్ భగీరథ నీళ్ల కోసం ఆధారపడాల్సి వస్తున్నది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సారి ఎండాకాలంలో ప్రజలు నీళ్ల ట్యాంకర్లు, బోరుబావులను ఆశ్రయించక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ అధికారులు.. శ్రీ శైలంలో విద్యుత్తు ఉత్పత్తిని, ఎంజీకేఎల్ఐకి నీటి విడుదలను ఆపాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో కృష్ణానదికి ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. దీంతో శ్రీశైలంలో నీటి నిల్వలు గత సంవత్సరం కంటే తగ్గాయి. గతంలో శ్రీశైలం నుంచి రివర్స్ పంపింగ్ చేపట్టి మిషన్ భగీరథకు నీళ్లు అందించారు. ప్రస్తుతం శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టాలు ఉంచేందుకు విద్యుత్తు ఉత్పత్తి నిలుపుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎండాకాలంలో మంచినీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం.