పాలమూరు, ఏప్రిల్ 25 : యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం పీజీకే టెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన జాబ్మేళాలో 4500మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ సెక్టార్లో లక్షా30వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ సెక్టార్లో 15లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని, కేవలం 15రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఐటీ కారిడార్ను మే 6న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, కంపెనీల ఏర్పాటుతో 30వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపాల్స్, పీజీకే టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొన్నారు.