జడ్చర్ల, జనవరి 23 : బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రోజురోజుకూ కందుల ధరలు పెరుగుతూ నే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా క్వింటా రూ.9,719 ధర పలికింది. 176 క్వింటాళ్ల కందు లు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ. 9,719, కనిష్ఠంగా రూ.8,459, మధ్యస్తంగా రూ. 9,140 ధర పలికింది. 57 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం రాగా గరిష్ఠంగా రూ.3,065, కనిష్ఠంగా రూ.3,031, మధ్యస్తంగా రూ.3,065 ధర వచ్చింది.
6.141 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.7,189, కనిష్ఠంగా రూ.3,302, మధ్యస్తంగా రూ.6,841 ధర లభించింది. క్వింటా మినుములు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.6,480 ధర పలికింది. బెబ్బర్లు క్వింటా అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.7,150 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.