అచ్చంపేట, జూన్ 22 : కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మె ల్యే నియోజక సమన్వయకర్త మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ని యోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనాన్ని సోమవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ అచ్చంపేటకు ప్రస్తు తం నాయకత్వం లేకపోయినా పార్టీ కా ర్యకర్తల బలం తమకు అండగా నిలుస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రోత్సాహంతో అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేసినా బీఆర్ఎస్ సైనికులు ఏమాత్రం భయపడకుండా ప్రజల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీకలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్లతో మాట్లాడి కార్యకర్తలకు అండగా నిలుస్తామని హా మీ ఇచ్చారు. అచ్చంపేటలోనే సామాన్య కుటుంబానికి చెందిన ఒక కార్యకర్తను ఎమ్మెల్యేగా గెలిపించుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క సందేశంతో ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. అచ్చంపేట బీఆర్ఎస్కు తాము ఏమి చేసి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ క్యా డర్ అప్రమత్తంగా ఉండాలి.