తెలకపల్లి, నవంబర్ 28 : ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ‘గుడ్ మా ర్నింగ్ నాగర్కర్నూల్’లో భాగంగా మండలంలోని బొప్పల్లి గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకున్నా రు. ప్రభుత్వ పథకాలు అందుతున్నా యా..? ధరణి, ఆసరా పింఛన్, రేషన్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయా అని అడిగారు. గూడు లేనివారికి డబుల్బెడ్రూ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పథకాలు అందని లబ్ధిదారులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సర్పంచ్ పరశురాములుకు తెలిపారు.
రాష్ర్టానికి రావాల్సి న నిధులు చెల్లించకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి ప థకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నా రు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, ఎంపీపీ మధు, నాయకు లు నరేందర్రెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాసు లు, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.