తిమ్మాజిపేట, డిసెంబర్ 21 : నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి అంతిమయాత్ర కన్నీటి వీడ్కోలు మధ్య సాగింది. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని మర్రి స్వగృహంలో ఆయన మృతి చెందగా.. స్వగ్రామం తిమ్మాజిపేట మండలంలోని నేరళ్లపల్లికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. శనివారం పార్థివదేహాన్ని బంధువులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. మర్రి వ్యవసాయ క్షేత్రం లో తండ్రి చితికి జనార్దన్రెడ్డి నిప్పంటించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రా మం లో విషాదచాయలు అలముకున్నాయి.
ప్రముఖుల నివాళి
మర్రి జంగిరెడ్డి పార్ధివ దేహాన్ని పలువురు సందర్శించారు. మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, బీ రం హర్షంవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నేత లు ఒంటేరు ప్రతాప్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, నాగం శశిధర్రెడ్డి, శివకుమార్, పార్టీశ్రేణులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జంగిరెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రిని, కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఓదార్చారు. ఎమ్మెల్సీ నవీన్ పాడె పట్టారు.