రాజోళి, మార్చి 31 : 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలను 9 అంశాల్లో ఎంపిక చేశారు. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో రాజోళి మండలంలోని మాన్దొడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మాన్దొడ్డి గ్రామం 4,109.17 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 16.18 ఎకరాల్లో గృహ నిర్మాణాలు ఉండగా.., ఆర్డీఎస్ కింద 2,304.21 ఎకరాలు, 901.33 ఎకరాల మెట్ట భూముల్లో పంటలను సాగుచేస్తున్నారు. 4,623 మంది జనాభా ఉం డగా, అందులో 2,312 మంది మహిళలు, 2,311 మంది పురుషులు ఉన్నారు. 2,863 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నా రు. గ్రామంలో అక్షరాస్యతా శాతం 54.27గా ఉన్నది. రెండు రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,416 జాబ్కార్డులు ఉండగా.. 948 మంది పనుల్లో పాల్గొంటున్నారు. 29 మహిళా సం ఘాలు, మూడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నా యి. రైతు, యువజన సంఘాలు గ్రామ సమస్యలను పరిష్కరిస్తున్నారు. 10 ఎకరాలకు పైగా క్రీడా ప్రాంగణం ఉన్నది. అందులోనే సం క్రాంతి సందర్భంగా దాతల సహకారంతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి..
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగడంతో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. గ్రామస్తులకు పని క ల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను పెంచుతూ ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారు. ఎంజీఎన్ఆర్ఎస్ నిధులతో వ్యవసాయ భూములకు రహదారులను ఏర్పాటు చేశారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మాంచారు. 90 శాతం సీసీ రోడ్ల నిర్మా ణం చేపట్టారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తూ.. వారు స్వయం ఉపాధి చేసుకునేలా పంచాయతీ కార్యదర్శి, సర్పంచు కృషి చేశారు. రైతువేదిక, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలు నిర్మించా రు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా తడి, పొ డి చెత్తతో సేంద్రియ ఎరువులను తయారీ చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో 340 ఎల్ఈడీ లైట్లు బిగించారు.
పేదరిక నిర్మూలనకు తీర్మానం చేశాం..
మాన్దొడ్డి గ్రామంలో ప్రజాప్రతినిధులతో కలిసి ఎంజీఎన్ఆర్ఎస్ ని ధులను వినియోగించుకునాం. పేదరిక నిర్మూలనకు కృషి చేసేలా తీ ర్మానం చేసుకున్నాం. ఇందులో భాగంగా గ్రామస్తులకు పని కల్పించాం. పొలాలకు రహదారులను నిర్మించాం. పారిశుధ్య పనులు, మొక్కల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, పెద్దల సహకారమే గ్రామ అభివృద్ధికి ముఖ్య కారణం.
– దస్తగిరి, పంచాయతీ కార్యదర్శి, మాన్దొడ్డి
చాలా సంతోషంగా ఉన్నది..
రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం చాలా సం తోషంగా ఉన్నది. ప్రజల సహకారంతోనే అభివృద్ధి పనులు చేపడుతు న్నాం. వైకుంఠధామం, రైతువేదిక, పల్లె ప్రకృతివనాలు, క్రీడా ప్రాం గణం, సీసీ రోడ్లు ఏర్పాటు చేశాం. రోడ్లకిరువైపులా మొక్కలను పెంచుతున్నాం. చెత్త సేకరణ కోసం ప్రజలకు అవగాహన కల్పించాం. మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి స్వయం సమృద్ధి సాధించేలా చేశాం. గ్రామస్తులందరం కలసి సమస్యలను పరిష్కరించుకుంటున్నాం.
– సవారి, సర్పంచ్, మాన్దొడ్డి