హన్వాడ, జనవరి 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం మం డల అధికారి చర్యలు చేపట్టారు. ఇప్పుటికే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల అధ్యక్షులు, బుక్ కీఫర్లతో సమావేశాలు నిర్వహించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు ని ర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిఒక్కరూ 10 మంది చొప్పున పరీక్షలు చేయించాలని అధికారులు ఆదేశించారు.
మండలంలో 35 గ్రామ పంచాయతీల్లో 18 ఏం డ్లు పైబడిన వారు 37వేలకు పైగా ఉన్నారు. అందరికీ పరీక్షలు చేయించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా అం దజేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మండలం లో 100 రోజులు నిర్వహించడం జరుగుతున్నది. మండలంలో మూడు బృందాలు పనిచేస్తాయి. ప్రతిరోజూ 9 నుం చి 5 గంటల వరకు 300 మందికి పరీక్షలు చేయడం జరుగుతున్నది. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
హన్వాడ గ్రామంలో 6,705 మంది, టంకరలో 4,778 మంది, సల్లోనిపల్లిలో 1,695 మంది, నాయినోనిపల్లిలో 1,764 మంది, ఇబ్రహీంబాద్లో 1,901 మంది, వేపూర్ లో 4,371 మంది, పుల్పోనిపల్లిలో 1,014 మంది, రామన్నపల్లిలో 1,057 మంది, బుద్ధారంలో 2,354 మంది, పెద్దదర్పల్లిలో 2,269 మంది, గొండ్యాలలో 3,081 మం ది, కారంతండాలో 545 మంది, దోర్రితండాలో 841 మంది, తిరుమలగిరిలో 989 మంది, షేక్పల్లిలో 1,325 మంది, కోనగట్టుపల్లిలో 1,865 మంది, అత్యకుంటతండా లో 721 మంది, ఎల్లబాయితండాలో 871 మంది, కిష్టపల్లిలో 1,028 మంది, పల్లెమోకాలనీలో 508 మంది, వెంకటమ్మకుంటలో 889 మంది, యారోనిపల్లిలో 600 మంది, అయోధ్యనగర్లో 958 మంది, మాదారంలో 84 8 మంది, ఎనమిదితండాలో 895 మంది, నాగంబాయితండాలో 474 మంది, అమ్మపురంలో 637 మంది, మునిమోక్షంలో 3,000 మంది, కిష్టంపల్లిగేటులో 491 మం ది, ఎర్రగట్టుతండాలో 534 మంది, లింగన్నపల్లిలో 10, 06 మంది, దచ్చక్పల్లిలో 1,674 మంది, గుడిమల్కాపూ రంలో 1,690 మంది, రాంనాయక్తండాలో 519 మం ది, కోత్తపేటలో 2,812 మంది ఉన్నారు.