ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టింది. పేద విద్యార్థులు చదువుకునే సరస్వతీ నిలయాల్లో సకల సదుపాయాల కల్పనకు సర్కార్ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం ‘మనఊరు-మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. మొదటివిడుతగా ఉమ్మడి జిల్లాలోని 1,092 పాఠశాలలను ఎంపిక చేశారు. పాలమూరులో 291 పాఠశాలలకు రూ.112.404 కోట్లు, నారాయణపేట జిల్లాలో 167 పాఠశాలలకు రూ.30 కోట్లు, వనపర్తి జిల్లాలో 183 బడులకు రూ.79.99 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 161 స్కూళ్లకు రూ.72.89 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 290 పాఠశాలలకు రూ.70 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించేందుకు రూ.365.284 కోట్లు కేటాయించారు. అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. దీంతో త్వరలో సర్కార్ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో మారనున్నాయి.
నారాయణపే ట, డిసెంబర్ 6 : ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక వసతులు క ల్పించి అభివృద్ధి చేయాల న్న లక్ష్యంతో సర్కార్ మన ఊ రు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో 513 బడుల్లో.. 62,485 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మన ఊ రు-మన బడిలో భాగంగా మొదటి విడుతలో 174 పాఠశాలను ఎంపిక చేయగా.. 167 స్కూళ్లకు అనుమతిచ్చారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలల ను మోడల్గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భా గంగా జిల్లాలో 22 మోడల్ స్కూల్స్ల్లో వంద శాతం పనులు పూర్తికాగా.., 15 రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. రూ.30 లక్షల పైన పనులు చేపట్టాల్సినవి 26 పాఠశాలలు ఉండగా, రూ.30 లక్షల లోపు పనులు చేపట్టాల్సినవి 141 పాఠశాలలు ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగానూ రూ.30 కోట్లతో మొదటి విడుతగా 167 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. తాగునీటి వసతి, విద్యుద్దీకరణ, నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, కిచెన్షెడ్లు, డైనింగ్ హాల్, నూతన తరగతి గదుల నిర్మాణం వంటి పనులు చేస్తున్నారు. జిల్లాలో 30 పాఠశాలల్లో వంద శాతం మరమ్మతులు, పెయింటింగ్, నీటివస తి, టాయిలెట్ల పనులు పూర్తయ్యాయి. పాఠశాలలకు ఫర్నీచర్లు, గ్రీన్ చాక్ బోర్డులు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయనున్నది. పనులు పూర్తయిన చోట కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి.
గద్వాల, డిసెంబర్ 6 : ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నా యి. శిథిలావస్థకు చేరకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లాలో 461 పాఠశాలలు ఉ న్నాయి. ఇందులో మన ఊరు-మ న బడి కింద మొదటి విడుతలో 81 పీఎస్లు, 28 యూపీఎస్లు, 52 హైస్కూల్స్ను ఎంపిక చేశారు. ఇందులో 41,423 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం 161 పాఠశాలల్లో.. 43 చోట్ల రూ.30 లక్షల పైన నిధులతో పనులు చేయనుండ గా.. విద్యాశాఖ అధికారులు టెండర్లకు ఏర్పాట్లు చే శారు. అయితే మిగతా 118 పాఠశాలల్లో రూ.30 లక్షల లోపు చొప్పున పనులు చేపడుతున్నారు. మొ దటగా పాఠశాలలకు రంగులు వేసి సుందరంగా తీ ర్చిదిద్దుతున్నారు. ఈ నిధులతో ఎనిమిది రకాల ప నులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా 50 శాతం పనులు పూర్తి కాగా.. ఇందుకోసం రూ.5 కోట్ల మేర ఖర్చు చేశారు. వీటితో పాటు 161 పాఠశాలల్లో మండలానికి రెం డు బడుల చొ ప్పున మోడల్గా తీర్చిదిద్దేందుకు జిల్లాలో 24 ఎం పిక చేశారు. అందులో ఇటిక్యాల మండలం కొం డేరు, వడ్డేపల్లి మండలం కొంకల, అయిజ మండలం ఉత్తనూర్ పాఠశాలలు పనులు పూర్తి చేసుకొని పునఃప్రారంభానికి సి ద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు మొ దటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు 50 శాతం నిధులు రూ.5.16 కోట్లు విడుదలయ్యాయి.
వనపర్తి టౌన్, డిసెంబర్ 6 : వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 518 పాఠశాలలు ఉండగా.. మొదటి విడుతలో 183 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.79.99 కోట్లు వెచ్చిస్తున్నది. 14 మండలాల్లోని 28 పాఠశాలల్లో పనులు వంద శాతం పూర్తికాగా.. 139 పాఠశాలల్లో చివరి దశకు చేరుకున్నాయి. పనులను మూడు విభాగాల్లో చేపడుతున్నారు. జాతీయ ఉ పాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో భాగంగా టాయిలెట్లు, కంపౌండ్ వాల్ నిర్మాణం, కిచెన్షెడ్డు, రాష్ట్ర ప్రభుత్వం (ఎస్ఈసీ)లో భాగంగా కరెంట్ పనులు, తాగునీటి వసతి, మేజర్, మైనర్ పనులు, శిథిలమైన వాటి స్థా నంలో నూతన భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా సీపీఎం ప థకం కింద విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్ కొనుగోలు, డైనింగ్ హా ల్ నిర్మాణం, పాఠశాలకు పెయింటింగ్, డిజిటల్ విద్య కొనసాగింపు, గ్రీన్ బోర్డుల ఏర్పాటు పనులను చేపడుతున్నారు. రూ.30 లక్షల లోపు విలువ గల పనులు చేపట్టాల్సిన పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.30లక్షలకు పైగా ఉన్న పనులకు జిల్లావ్యాప్తంగా 41 పాఠశాలల్లో టెం డర్లు పిలిచారు. అందులో ఐదు టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. స్థానిక స మస్యల కారణంగా ఆరు పాఠశాలల్లో టెండర్లను పూర్తిచేయలేదు. కోర్టు కే సులు, స్థల సమస్యలతో పనులు చేపట్టలేకపోతున్నారు.
నాగర్కర్నూల్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ చేకూరుతున్నది. 885 ప్రభుత్వ పాఠశాలలకుగానూ మన ఊరు-మన బడిలో భాగంగా తొలి విడుతగా 290 స్కూళ్లను ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో టాయిలెట్లు, విద్యుద్ద్ధీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయిటింగ్, గోడల మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త గదులు, డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య ఉపకరణాలు వంటి పనులు చేపట్టనున్నారు. మే 6వ తేదీన జిల్లాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా మేడిపూర్, గగ్గలపల్లి పాఠశాలల్లో పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం వెచ్చించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభమైంది. ఇక ఎంపిక చేసిన పాఠశాలల్లో మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 195 పనులకుగానూ రూ.48కోట్ల అంచనా కాగా.. రూ.29 కోట్ల వరకు పనులు జరిగాయి. ఇందులో రూ.5 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 290 పాఠశాలల్లో 205 చోట్ల పనులు చేపట్టారు. ఇందులో 159 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జనవరి నాటికి వంద శాతం పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.