మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అహర్నిషలు కృషి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తీసుకురాగా సాగునీరు పుష్కలంగా అందడంతో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. రిజర్వాయర్ల కింద నిర్వాసితులైన ప్రజలకు నష్టపరిహారం అందజేశారు. రూ.15 కోట్లతో మున్సిపాలిటీలను సుందరీకరించారు. ప్రతి గ్రామానికి బీటీ, సీసీ రోడ్డు సౌకర్యం కల్పించారు. సబ్స్టేషన్లను నిర్మించడంతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తొలగాయి. దేవరకద్ర-మునీరాబాద్ రైలు మార్గంలో భాగంగా జక్లేర్, మక్తల్, మాగనూర్, కున్షి స్టేషన్లను నిర్మించడంతో రాయిచూర్ నుంచి కాచిగూడకు రైలు ప్రయోజనం చేకూరింది. మక్తల్కు డిగ్రీ కళాశాల మంజూరు చేయించారు. రూ.35 కోట్లతో ఏర్పాటు చేయనున్న 150 పడకల దవాఖానకు శంకుస్థాపన చేశారు. రుద్రసముద్రం సమీపంలో రూ.6 కోట్లతో వ్యవసాయ గోదాంలను నిర్మించారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో మక్తల్లో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకేనని ప్రజలు చెబుతున్నారు.
ఊట్కూర్, నవంబర్ 1 : బీఆర్ఎస్ సర్కారు పాలనలో మక్తల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. రూ.కోట్ల నిధులతో
అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి
చిట్టెం రామ్మోహన్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించనున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తరఫున పోటీ చేసి
నారాయణపేట జిల్లాలోనే అత్యధికంగా 45 వేలకుపైగా మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఆనాటి నుంచి నేటి వరకు
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్
సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో చిట్టెం గెలుపు నల్లేరు
మీద నడకేనని ప్రజలు చెబుతున్నారు.
1952లో మక్తల్ నియోజకవర్గంగా ఏర్పడిం ది. ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. డీలిమిటేషన్లో భాగంగా 2009 ఎన్నికల్లో మక్తల్ సెగ్మెంట్ నుంచి నారా యణపేట, దామరగిద్ద మండలాలను తొలగించి కొత్తగా అమరచింత సెగ్మెంట్లో ఉన్న ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాలను మక్తల్కు చేర్చారు. మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూరు, కృష్ణ, ఆత్మకూర్, అమరచింత మొత్తం 7 మండ లాలతో కలిపి మక్తల్ నియోజక వర్గం ఏర్పడింది. 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్, ఇండిపెం డెంట్ అభ్యర్థులే విజయం సాధించారు. 1972 లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కల్యాణీ రాంచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. అదే సెగ్మెంట్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తండ్రి, దివంగత చిట్టెం నర్సిరెడ్డి ఒక పర్యాయం జనతా పార్టీ నుంచి, మరోసారి జనతా దళ్ పార్టీ నుంచి గెలుపొందారు. రెండు సార్లు టీడీపీ నుండి ఎల్లారెడ్డి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన చిట్టెం నర్సిరెడ్డి 2005 పంద్రాగస్టు వేడుకల్లో నక్సల్స్ జరిపిన కాల్పుల్లో మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు చిట్టెం రామ్మోహన్రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడు గు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సాధించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రామ్మోహన్రెడ్డి గెలుపొందారు. సీఎం
కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధిని చూసి అనతి కాలంలోనే గులాబీ పార్టీలో చేరారు. వలసలకు నిలయమైన మక్తల్ను
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తీవ్రమైన కృషి చేశారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువై 2018 ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా
గెలుపొందా రు. సీఎం కేసీఆర్ మక్తల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి చేయించారు.
రామన్పాడు, భీమా, భూత్పూర్, సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ల నుంచి మక్తల్, కృష్ణ, మాగనూర్, నర్వ, ఆత్మకూర్,
అమరచింత మండలాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించారు. రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన వేలాది మంది
నిర్వాసితులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కృషితో గ్రామాల్లో ఎటుచూసినా పచ్చని పైర్లు, సాగు నీటి వసతితో పంట పొలాలు కోనసీమను తలపిస్తున్నాయి.
విద్య, వైద్యరంగాల పరంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెం మక్తల్ అభివృద్ధికి పెద్దపీట వేశారు. పట్టణంలో కొత్తగా డిగ్రీ కళాశాల
ఏర్పాటుకు రూ.6 కోట్లు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో నాలుగు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. రూ.9 కోట్లతో
ఊట్కూర్, నర్వ, కృష్ణ, అమరచింత మండలాల్లో కేజీబీవీ స్థాయిని పెంచి విద్యార్థినులకు ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే
అవకాశం కల్పించారు. పట్టణంలో రూ.35 కోట్లతో 150 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మారుమూల
గ్రామాల్లో పల్లె దవాఖానల ఏర్పాటుకు కృషి చేశారు. రూ.1.70 కోట్లతో సమీకృత మార్కెట్, రూ.70 లక్షలతో మార్కెట్ కార్యాలయ
భవన నిర్మాణ పనులను చేపట్టారు. రుద్రసముద్రం సమీపంలో రూ.6 కోట్లతో వ్యవసాయ గోదాంలను నిర్మించారు. అభివృద్ధి,
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. మక్తల్
నియోజకవర్గంలో మున్సిపాలిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీ చైర్మన్, డీసీసీబీ
చైర్మన్ బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. మక్తల్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగరడం
ఖాయం కావడంతో ఇతర పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.