జడ్చర్లటౌన్, జూలై17 : పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు సెంటర్లో తూ కం వేసిన రసీదులు ఇచ్చిన తర్వా త డబ్బులు చెల్లింపులు వచ్చేసరికి మక్కల తూకం తగ్గిందని అధికారులు రైతులకు ఇచ్చే డబ్బులు ఏ విధంగా కట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీసీఎస్, మా ర్క్ఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగొలు చేసిన మక్కలను ఎవరూ మె క్కారో బయటపెట్టాలన్నారు. మొ క్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆర్డీవో నవీన్కు వినతిపత్రాన్ని సమర్పించారు.