ధన్వాడ, ఏప్రిల్ 17 : దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం 48 మంది దళితులకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి ఎంపీ మన్నె భూమి పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో రూ.213 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం, రూ.12 లక్షలతో నిర్మించిన మినీ మార్కెట్ యార్డు, రూ.32 లక్షలతో చేపట్టిన మన ఊరు-మన బడి పనులను ప్రారంభించారు. రూ.25 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, రూ.28 లక్షల సీడీపీ నిధులతో నిర్మించ తలపెట్టిన కాజ్వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మినీ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టి ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, పింఛన్లు వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఆదుకుంటున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమ వద్ద కూడా పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతూ బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. దేశంలో 70 వేల టీఎంసీలు వృథా అవుతున్నా.. ప్రాజెక్టులు నిర్మించి పొలాలకు సాగునీరందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మతులు చేశామన్నారు. గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత కేసీఆర్ద అని అన్నారు. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారాయన్నారు. కిష్టాపూర్ గ్రామంలో 48 మంది దళితులకు ఒక్కొక్కరికీ 2.15 ఎకరాలను పంపిణీ చేశామన్నారు. ఇండ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకంలో భాగస్వాములను చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, జెడ్పీటీసీ విమలాదేవి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వాహీద్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, ఎంపీడీవో సద్గుణ, సర్పంచ్ దామోదర్రెడ్డి, తాసీల్దార్ నాగలక్ష్మి, రైతుమంధు సమితి కన్వీనర్లు వెంకట్రెడ్డి, సంపత్కుమార్, సింగిల్విండో ఉపాధ్యక్షుడు బాలరాజు, ఎంపీటీసీ కడపయ్య, నాయకులు రాజవర్ధన్రెడ్డి, సునీల్రెడ్డి, కొండారెడ్డి, మురళీధర్రెడ్డి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.