మహబూబ్నగర్, మే 15 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి)/మహబూబ్నగర్/టౌన్/మెట్టుగడ్డ : తెలంగాణ ఏర్పడి న తర్వాత మహబూబ్నగర్ లో భూములు బంగారమయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హా ల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను రెండో రోజైన ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సుసంపన్నులను చేయడమే తమ లక్ష్యమన్నారు.
ఒకప్పుడు మహబూబ్నగర్లో తాగునీటికి కష్టాలు పడే పరిస్థితి ఉండేదని.., తెలంగాణ ఏర్పాటయ్యాక సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించామన్నారు. 2014 కంటే ముందు ఎకరా భూమి రూ. 10 లక్షల లోపు ఉండేదని, నేడు ఆ భూములే కోట్ల రూపాయలు పలుకుతున్నాయన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా స్థిరాస్తులకు భారీగా వి లువ పెరిగిందన్నారు. అద్భుతమైన రహదారు ల నిర్మాణం, పట్టణానికి తలమానికంగా బైపాస్ రోడ్డు, మినీ ట్యాంక్ బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, కే సీఆర్ అర్బన్ ఎకో పా ర్కు మహబూబ్నగర్ స్థా యిని అమాంతం పెంచేశాయన్నారు. హైదరాబాద్ నగరానికి సమీపం లో ఉన్న మహబూబ్నగర్ భవిష్యత్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు.
సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో కేవలం గంటలో చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) వల్ల ఈ ప్రాంతం హెచ్ఎండీఏ స్థాయిలో పురోగతి సాధించే వీలుందన్నారు. మహబూబ్నగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడించారు. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహబూబ్నగర్ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారన్నారు. వివిధ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ నుంచి సైతం పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులు కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన త ర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మతకల్లోలాలకు తావు లేకుం డా శాంతిభద్రతలు కాపాడుతున్నామన్నారు.
అంతకుముందు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన శ్రీరామ ల్యాండ్ మార్క్, సిరి సం పద గ్రూప్, గిరిధారి, దేవాస్ ఇన్ఫ్రా, కామాక్షి, ఎంవీపీ స్పేసెస్, స్కంధాన్షి, రెయిన్ బో డెవలపర్స్, భాస్కర్ సిమెంట్స్, ఫార్చూన్ హైట్స్, శ్రీ సిమెంట్స్ వంటి సంస్థలతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యూబీఐ, కెనారా బ్యాంక్ స్టాళ్లను మంత్రి సం దర్శించారు. వినియోగదారులకు అందిస్తున్న సదుపాయాల గు రించి అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల నుంచి చక్కని స్పందన వచ్చిందని స్టాల్స్ యజమానులు మంత్రికి తెలిపారు. తొలిసారి ప్రాపర్టీ షో విజయవంతంగా నిర్వహించినందుకు మం త్రి ‘నమస్తే తెలంగాణ’ను అభినందిస్తూ.. భవిష్యత్లో ఇలాంటి షోలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాపర్టీ షో వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. షోకు వచ్చిన వారికి లక్కీడిప్ ద్వారా విజేతలను ఎంపిక చేయగా.. మంత్రి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామ ల్యాండ్ మార్క్ ఎండీ బెక్కరి రాంరెడ్డి, క్రెడాయ్ వైస్ చైర్మన్ చె రుకుపల్లి రాజేశ్వర్, నమస్తే తెలంగాణ ఏడీవీటీ జీఎం ఎన్.సురేందర్రావు, ఏజీఎం ఎం.రాజిరెడ్డి, మహబూబ్నగర్ బీఎం రాజశేఖర్, బ్యూరో ఇన్చార్జి విజయభాస్కర్, ఎడిషన్ ఇ న్చార్జి సత్యనారాయణ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ విజయ్కుమార్రెడ్డి, సర్క్యులేషన్ మేనేజర్ జగన్, సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో మొదటి సారిగా ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమని ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రాపర్టీ షో ముగింపు సమావేశానికి ఆదివారం ఎమ్మెల్యే హా జరయ్యారు. స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకే వేదిక ద్వారా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకునే అవకాశం దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఊహించని అభివృద్ధి చెందిందన్నారు. రియల్ ఎస్టేట్ అంటే గతంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాలకే పరిమితమయ్యేదని, కానీ నేడు హైదరాబాద్ నుంచి వచ్చి మహబూబ్నగర్, జడ్చర్లలో భూములు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. భూమి ధరలు పెరగడంతో అపార్ట్మెంట్ కల్చర్ వ చ్చిందన్నారు.
జిల్లాలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నా రు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందడంతో ఎం తో మంది కి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అనంత రం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్ ని ర్వాహకులకు ఎమ్మెల్యే మెమెంటోలు అందజే శారు. కార్యక్రమంలో ‘నమస్తే’ ఏడీవీటీ ఏజీఎం ఎం.రాజిరెడ్డి, బీఎం రాజశేఖర్, బ్యూరో విజయభాస్క ర్, ఎడిషన్ ఇన్చార్జి సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ విజయ్ కుమార్రెడ్డి, సర్క్యులేషన్ మేనేజర్ జగన్, శ్రీ రామ ల్యాండ్ మార్క్ డైరెక్టర్ బెక్కరి రాఘవేందర్రెడ్డి, సిరి సంపద జీఎం బాలకృష్ణ చౌదరి, గిరిధారి ప్ర తినిధి సుధీర్ కుమార్, కామాక్షి ఎండీ యుగం ధర్, దేవాస్ జీఎం నాగరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్ ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రఘుపతిరెడ్డి, నమస్తే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.