నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రాధాకృష్ణ స్వగృహంలో బుధవారం నిర్వహించిన సంతాపసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుతున్న ఒక యువనాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాధాకృష్ణ మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.
అతడి కుటుంబసభ్యులకు పార్టీ, ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వివరించారు. అలాగే టీటీడీ బోర్డుసభ్యుడు మన్నె జీవన్రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ తదితరులు నివాళులర్పించారు. అదేవిధంగా ఎంపీటీసీల సంఘం నాయకులు రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబాన్ని ప్రభుత్వపరం గా ఆదుకోవాలని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం, కృష్ణయ్య, వెంకటేశ్, ఎంపీటీసీలు తుల్సీరాంనాయక్, గోపా ల్, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, నాయకులు నాగిరెడ్డి, పాశం గోపాల్, ప్రతాప్, భోజయ్యచారి, యన్మన్గండ్ల లక్ష్మయ్య, కృష్ణగౌడ్, వెంకటేశ్, గాండ్ల రవి, ఎర్రోళ్ల శ్రీను, నాగిరెడ్డి, నవనీతరావు, నర్సింహులు, రామకృష్ణ పాల్గొన్నారు.