బాలానగర్, జూలై 16 : రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ను చూసే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో బాలానగర్ మండలంలోని మన్నెగూడ, పెద్ద బాయితండాకు చెందిన పది మంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకుడు జగన్నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు టీఆర్ఎస్ పాలనను స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్రాములు, టీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.