నారాయణపేట, జూలై 7: కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులో ఉన్న భూమి విషయంలో పేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డిపై సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులో సాగుకు అనుకూలంగా లేని భూ మిలోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సంకల్పించినట్లు చెప్పారు.
అయితే ప్రతిపక్షాల నాయకులు రైతులతో ధర్నాలు, ఉద్యమాలు చేయించడంతో ఆ ప్రస్తావనను మానుకున్నట్లు చె ప్పారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విషయ పరిజ్ఞానం లేకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు, సంస్కారహీనంగా మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధ్ది, వ్యక్తిత్వం తెలిసినవారు ఇలా మాట్లాడరని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కన్నా జగదీశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, కౌన్సిలర్ గురులింగప్ప, సీనియర్ నాయకులు శివరాంరెడ్డి, కార్తీక్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ దిష్టిబొమ్మ దహనం
దామరగిద్ద, జూలై 7: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను కంసాన్పల్లి రైతులు, టీఆర్ఎస్ మండల నాయకులు మండల కేంద్రంలో దహనం చేశారు. మండంలోని కంసాన్పల్లి రైతులకు భూమి పట్టాలు అందించే విషయంలో ఎమ్యెల్యే ఎస్ఆర్రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు నిరసనగా మండల నాయకులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు ఆశన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని, ఈ విషయమై ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, కంసాన్పల్లి సర్పంచ్ గురునాథ్గౌడ్, రైతులు రాంచందర్గౌడ్, మాజీ ఎంపీపీ పెద్దకిష్టప్ప, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, జూలై 7: నోట్లకు అమ్ముడుపోయే అలవాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లంబా డి తిరుపతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దామరగిద్ద మండలంలోని కంసాన్ పల్లి గ్రామంలో రైతుల భూములు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఆక్రమంగా లాక్కోవడం జరిగిందని ఆరోపణలు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. సమావేశంలో వైస్ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీ గోపాల్, నాయకులు కృష్ణారెడ్డి, జగదీశ్, కొండారెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మతీన్, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కానుగంటి నారాయణ, మక్తల్ రాజరెడ్డి, కర్లీ కృష్ణయ్య, విష్ణుకాంత్రెడ్డి, దుబాయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడలో
ధన్వాడ, జూలై 7: ధన్వాడలో టీఆర్ నాయకులు ఆధ్వర్యంలో గురువారం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై అసభ్యంగా మాట్లాడుతూ తప్పడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించడంతో జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై తప్పడు ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. కొడంగల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన నీవు ఏం అభివృద్ధి చేశావంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. వెంటనే ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం లో సర్పంచ్ చిట్ట్టెం అమరేందర్రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, ఎంపీటీసీ సుధీర్కుమార్, మండల ప్రధా న కార్యదర్శి చంద్రశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు సునీల్రెడ్డి, ఉపాధ్యక్షుడు సచిన్ తదితరులు పాల్గ్గొన్నారు.