గద్వాల అర్బన్, జూన్ 6 : కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందగా.. మరో 50 మం ది అస్వస్థతకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతవారం రోజులుగా జిలా కేంద్రంలో డ్రైనేజీ పనుల చేపడతున్నారు. ఈ క్రమంలో పైప్లైన్ లీకేజీ కారణంగా నీరు క లుషితం అవుతున్నట్లు స్థానికులు గుర్తించి మున్సిపల్ అధికారులు పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం నుంచి నీరు మరింత కలుషితం కావడంతో గంటగేరి, వేదనగర్, ధ రూర్ మెట్టు తదితర ప్రాంతాల్లోని కాలనీకి చెం దిన ప్రజలు వాటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా దాదాపు 50 మంది పైగా వాంతులు, విరోచనాలతో గ ద్వాల దవాఖానలో చేరారు. చికిత్స పొందుతున్న షికాల కృష్ణ, నర్సింగమ్మ పరిస్థితి విషమించడంతో బుధవారం కర్నూలు దవాఖానకు తరలించే క్రమంలో మార్గమధ్యంలో మ రణించారు. ఇంత జరిగాక ఆయా కాలనీలో సరఫరా అయిన నీటిని తాగొవద్దని మున్సిప ల్ అధికారులు సూచించారు.
విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్ పర్సన్ సరిత ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి కాలనీల్లో పర్యటించారు. మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటిని పరిశీలించి శాంపిల్స్ను పరీక్షకు పంపించారు.