కోడేరు, జూలై 6 : చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రా మంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల కథనం ప్రకా రం.. మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్తూ తన కూతురు భవాని(7)ని తన తల్లిగారి ఊరైన వనపరర్తి జిల్లా గోపాల్పేట మండలం కేశంపేటలో తల్లి శాంతమ్మ వద్ద వదిలి వెళ్లింది. శాంతమ్మ వారంరోజుల కిందట మనుమరాలు భవానిని తీసుకొని తన తల్లిగారి ఊరైన రాజాపూర్కు పెంటమ్మ ఇంటికి వచ్చింది. రాజాపూర్ గ్రామానిఊపిరితీసిన ఊర చెరువు
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి
కి చెందిన శంకర్ కూతురు సమీరా(8), భవాని ఇద్దరి ఇండ్లు పక్క పక్కనే ఉండడంతో రోజు కలిసి ఆడుకునేవా రు. మంగళవారం సాయంకాలం కూడా ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న ఊరచెరువులోకి వెళ్లి దుస్తులు వదిలిగట్టున పెట్టి నీళ్లలోకి దిగారు. ఇద్దరికీ ఈతరాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మంగళవారం సాయంత్రం కుటుంబీకులు గ్రామంలో ఎంత వెతికినా దొరుకలేదు. చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించడంతో మత్స్యకారుల సాయంతో చేపలు పట్టే వలలు వేసి గాలించడంతో ఇద్దరు బాలికల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. భవాని మృతదేహాన్ని కేశంపేటకు తీసుకెళ్లగా సమీరా కోసం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.