కోస్గి, జూలై 5 : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన మండలంలోని గుండుమాల్ గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. బలభద్రాయిపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మం, శ్రీను, గుండుమాల్కు చెందిన వెం కటేశ్ మేస్త్రీ పని చేస్తూ జీవించేవారు.
కాగా, వారు ముగ్గురు ఒకే బైక్ పై గుండుమాల్ నుంచి కోస్గికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు. ముగ్గురూ 30 ఏండ్ల లోపు వారే. బ్రహ్మానికి ఏడాది కిందటే వివాహం జరిగింది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమి త్తం నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.