కల్వకుర్తి, ఆగస్టు 5 : పనిభారం తగ్గించాలనే డిమాండ్తో బుధవారం కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదు ట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాలం చెల్లిన బస్సులతో ఇబ్బందులు తతెత్తుతున్నాయని, పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్లుగా నడిపిస్తుండటంతో పనిభారం పెరిగిపోతుందని కార్మి క సంఘ నాయకులు రవీందర్ ఆందోళన వ్యక్తం చేశాడు.
పనిభారం పెరగడంతో ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుందని వాపోయారు. సమస్యలను పరిష్కరించాలని డీఎం ఇతర ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నా..వారి నుంచి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో భాగంగా ఉద్యమించడం తప్పా మరో మా ర్గం లేకుండా పోయిందని అన్నారు. మేనేజ్మెంట్ సమస్యలను పరిష్కరించకుంటే రిలే దీక్షలకు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎం యూ కార్యదర్శి రవీందర్, అధ్యక్షుడు జగదీశ్వర్, ఆర్టీసీ ఉద్యోగులు విజయ్, భానుప్రకాశ్, కృష్ణ, ఏఆర్రెడ్డి, శేషన్న, బాలకృష్ణ, ఆర్సీ శేఖర్, గోవర్ధన్, ప్రసాద్, డీఆర్ చారీ, చెన్నయ్య, నర్సింహ, కేసీఎస్ రెడ్డి, నారాయణ, నిరంజన్, ఆర్ఎస్ రెడ్డితోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.