పుల్కల్, ఆగస్టు 5 : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక బహుళార్థక ప్రాజెక్టు సింగూరు.అలాంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది.పాలకుల నిర్లక్ష్యం,అధికారుల అలసత్వంతో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక బీటలుపారే స్థాయికి చేరుకుంటున్నది. ఇరవై రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ సింగూరు ప్రాజెక్టులోకి అడపాదడపా నీరు వస్తుంది. కానీ, జంట నగరాలకు, పుల్కల్,అందోల్,జహీరాబాద్,సదాశివపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు తాగునీటి కోసం అంతకన్నా ఎక్కువ నీరు విడుదల చేయాల్సి వస్తున్నది.
ఇటీవల ప్రాజెక్టు గేట్ల ద్వారా మూడు సార్లు 0.1 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు తాగునీటి కోసం వదిలిపెట్టారు. దీంతో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 523.600 మీటర్లు అంటే 4..168 టీఎంసీల నీరు ఉంది. ప్రతి రోజూ 380 క్యూసెక్యుల నీరు తాగుకోసం సరఫరా చేస్తున్నారు. కానీ గతసంవత్సరం ఇదే తేదీనాడు ప్రాజక్టులో 20.729టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917.అంటే ఇంకా 9 టీఎంసీలు తక్కు వ..గత సంవత్సరం ప్రాజక్టు జలకళతో పర్యాటకుల తాకిడి ఉంటే ఇప్పుడు అడుగంటిపోతోంది. ప్రాజెక్టు మరమ్మతు కారణంగా ఉన్న నీరు ఖాళీ చేస్తున్నారు.