జడ్చర్ల టౌన్, జూలై 5 : పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వివిధ కాలనీల్లో మురుగుకాలువలు నిండుగా ప్రవహించడంతోపాటు రోడ్లపై వరద చేరింది. పట్టణ ప్రధాన రహదారిపై మోకాల్లోతు వర్షపునీరు చేరటంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్లు, ద్విచక్రవాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వర్షపునీరు నల్లకుంట చెరువు నీటిమునిగింది.
పట్టణంలోని వెంకటేశ్వరకాలనీ, రాజీవ్నగర్కాలనీ, చైతన్యనగర్, శివాజీనగర్కాలనీలతో పాటు లోతట్టుకాలనీలోని ఇండ్లలోకి వర్షపునీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8గంటల వరకు దాదాపు 80మి.మీ. పైగా వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. భారీ వర్షంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో వాతావరణం చల్లబడింది.