మహబూబ్నగర్/టౌన్, జూన్ 30 : పదోతరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. గురువారం విడుదలైన ఫలితాల్లో 88.47శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో మొత్తం 13,083మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 11,575 మంది ఉత్తీర్ణత సాధించారు. 88.47శాతం ఉత్తీర్ణతతో జిల్లా 28వ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా 225మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 గురుకులాల్లో మొత్తం 1,070మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1067మంది ఉత్తీర్ణత సాధించినట్లు గురుకులాల రీజియన్ కన్వీనర్ లింగయ్య తెలిపారు.
విద్యార్థులకు అభినందన
కోయిలకొండ, జూన్ 30 : పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అభినందించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సత్తా చాటిన ప్రభుత్వ బడుల విద్యార్థులు
జడ్చర్లటౌన్, జూన్ 30 : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. బాదేపల్లి సిగ్నల్గడ్డ హైస్కూల్ విద్యార్థిని ఎం.మౌనిక, చిట్టెబోయిన్పల్లి గురుకుల విద్యార్థిని వి.నిఖిత 10/10 గ్రేడ్లు సాధించి టాపర్లుగా నిలిచారు. మండలంలో మొ త్తం 1,199మంది పరీక్షలు రాయగా, 986మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 82.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాదేపల్లి ఉర్దూమీడియం బాలికల పాఠశాలలో వందశాతం, కావేరమ్మపేట జెడ్పీ హైస్కూల్లో 50శాతం ఉత్తీర్ణత నమోదైంది. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 97.70శాతం, మైనార్టీ గురుకులంలో 81.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల కు ఎంఈవో మంజులాదేవి అభినందనలు తెలియజేశారు.
నవాబ్పేటలో 89.54శాతం ఉత్తీర్ణత
నవాబ్పేట, జూన్ 30 : మండలంలో 89.54శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రాజునాయక్ తెలిపారు. పోమాలలో 77.14శాతం, కూచూర్లో 85.71, కారుకొండ ఇంగ్లిష్ మీడియంలో 100, తెలుగు మీడియంలో 87.23, నవాబ్పేట ఇంగ్లిష్ మీడియంలో 100, తెలుగు మీడియంలో 74.65, లింగంపల్లిలో 98.18, ఇప్పటూర్లో 90.74, కొల్లూరులో 86.05, చౌడూర్లో 87.88, యన్మన్గండ్లలో 92.22, నవాబ్పేట కేజీబీవీలో 97.92, గీతాంజలి పాఠశాలలో 100, సూర్యతేజ పాఠశాలలో 91.67శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. మొత్తం 583మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 522మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. యన్మన్గండ్ల విద్యార్థిని కె.మాధవి 9.8 జీపీఏ సా ధించి మండల టాపర్గా నిలువగా, నవాబ్పేట కేజీబీవీ విద్యార్థిని పి.శ్రావణి 9.7 జీపీఏ సాధించి ద్వితీయస్థానంలో నిలిచింది.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జూన్ 30 : ఎస్ఎస్సీ ఫలితాల్లో స్థానిక కేజీబీవీ విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య తెలిపారు. కేజీబీవీ విద్యార్థిని నిఖిత 9.5 జీపీఏ సాధించింది. అలాగే రాజాపూర్ పాఠశాలలో 83మందికిగానూ 60మంది విద్యార్థులు, తిర్మలాపూర్ పాఠశాలలో 72 మందికిగానూ 55మంది, రంగారెడ్డిగూడ పాఠశాలలో 39మం దికిగానూ 32మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
గండీడ్ మండలంలో..
మహ్మదాబాద్, జూన్ 30 : మండలంలోని నంచర్ల సాం ఘిక సంక్షేమ గురుకులంలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలో మొత్తం 541మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా, 442మంది ఉత్తీర్ణులయ్యారు. నంచర్ల గురుకుల విద్యార్థినులు హేమావతి, మానస 10/10 జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, జూన్ 30 : మండలంలోని వెన్నాచేడ్ మోడల్స్కూల్ విద్యార్థి భీష్మాచారి, గండీడ్ బాలుర పాఠశాల విద్యార్థి రాజేందర్ 10/10 జీపీఏ సాధించారు. మండలంలో తొమ్మిది ఉన్నత పాఠశాలల్లో 467మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 418మంది ఉత్తీర్ణులయ్యారు. 78.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఎంఈవో వెంకటయ్య తెలిపారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జూన్ 30 : పదోతరగతి పరీక్షా ఫలితాల్లో అడ్డాకుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. శాఖాపూర్ పాఠశాలలో అక్షిత 9.5 జీపీఏ సాధించి మండల టాపర్గా నిలువగా, అదే పాఠశాలకు చెందిన బి.వైశాలి 9.3 జీపీఏ, అడ్డాకుల పాఠశాల విద్యార్థిని తేజస్విని 9.3 జీపీఏ సాధించి ద్వితీయస్థానంలో నిలిచారు. మొత్తం 278మంది విద్యార్థులకుగానూ 249మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. శాఖాపూర్లో 97శాతం, పొన్నకల్ 83శాతం, రాచాలలో 89 శాతం, అడ్డాకులలో 88 శాతం, కందూరులో 99, కన్మనూరులో 81 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలోని నిజాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 100శా తం ఉత్తీర్ణత స్థాధించి మండలంలో బెస్ట్ పాఠశాలగా నిలిచింది. మూసాపేట పాఠశాలలో 85శాతం, జానంపేటలో 80 శాతం, పోల్కంపల్లిలో 78శాతం, నిజాలాపూర్లో 100 శాతం, వేములలో 79శాతం, అడ్డాకుల కేజీవీబీలో 89శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జానంపేట విశ్వభారతి విద్యార్థి సాయిశివ 9.5 జీపీఏ, మూసాపేట పాఠశాల విద్యార్థి రవికుమార్ 9.3 జీపీఏ, జానంపేట విద్యార్థి గీతాంజలి 9.3 జీపీఏ, అడ్డాకుల కేజీవీబీకి చెందిన రమ్యలత 9.3 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జూన్ 30 : మండలంలో మొత్తం 520మంది విద్యార్థులకుగానూ 426మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. భూత్పూర్ జెడ్పీహెచ్ఎస్లో 92మందికిగానూ 63మంది, కరివెనలో 20మందికి గానూ 17మంది, తాటికొండలో 48మందికిగానూ 31మంది, వెల్కిచర్లలో 40మందికిగానూ 32మంది, తాటిపర్తిలో 24మందికిగానూ 24 మంది, కొత్తమొల్గరలో 38మందికిగానూ 31మంది, పాతమొల్గర లో 31మందికిగానూ 23మంది, పోతులమడుగులో 37మందికిగా నూ 29మంది, అన్నాసాగర్లో 23మందికిగానూ 18మంది, కేజీబీవీలో 43మందికిగానూ 37మం ది, ఎంపీజేటీలో 75మందికిగానూ 75మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 10మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూన్ 30 : మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులంలో 79మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా, వందశాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఆరుగురు 10/10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. హన్వాడ ఉన్నత పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా, ఇద్దరు 9.7 జీపీఏ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపీపీ బాలరాజు, ప్రిన్సిపాల్ పద్మావతి అభినందించారు. అలాగే టంకర పాఠశాలలో 24మందికిగానూ 16మంది, కేజీబీవీలో 40మందికిగానూ 34మంది, వేపూర్లో 57మందికిగానూ 50మంది, చిన్నదర్పల్లిలో 24మందికిగానూ 20మంది, సల్లోనిపల్లిలో 33మందికిగానూ 25మంది, గొండ్యాలలో 50మందికిగానూ 46మంది, మునిమోక్షంలో 21మందికిగానూ 17 మంది, కొత్తపేటలో 32మందికిగానూ 26మంది, హన్వాడ ఉ ర్దూమీడియంలో నలుగురు, ఇబ్రహీంబాద్లో 11మంది, వేపూ ర్ ఉర్దూమీడియంలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు.