మహబూబ్నగర్టౌన్, జూన్ 17 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూప్రేమ్నగర్ ముదిరాజ్ భవనంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణాకేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా న్యూప్రేమ్నగర్కు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు కుట్టు శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెట్విన్ సంస్థ నుంచి 45 కోర్సులు ఉన్నాయని, మహిళలు నైపుణ్యం పెంచుకొని రాణించాలని సూచించారు.
భక్తిభావం అలవర్చుకోవాలి
మహబూబ్నగర్, జూన్ 17 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు కిశోర్, బాలీశ్వరి, తిరుపతయ్య, నందిపేట శ్రీనివాసులు, నవకాంత్, కృష్ణ, ఎస్.శ్రీను, నాయకులు వెంకట్రాములు, శ్రీనివాస్రెడ్డి, మెప్మా సీవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.