మూసాపేట, జూన్ 4 : మండలంలోని కోజెంట్ గ్లాస్ పరిశ్రమ యాజమాన్యం వితరణ చేసిన స్కూటీలు, సైకిళ్లను శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పంపిణీ చేశారు.
దివ్యాంగులకు 20 మూడుచక్రాల స్కూటీలు, వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 200 సైకిళ్లను అందజేసినట్లు పరిశ్రమ ఎండీ అక్షయ్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.