కృష్ణ, జూన్ 4 : కార్పొరేట్ రంగంలోని పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి, మెరుగైన విద్యను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు రాంరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మన ఊరు -మన బడి కార్యక్రామాలతో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు ఉచిత అడ్మిషన్తోపాటు పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్న భోజ నం అంది స్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభ, ప్రతిభ, కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్ కమల తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
మాగనూర్ జూన్ 4: మండల కేంద్రంలోని నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలు ఇతర అంశాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కాంప్లెక్స్ హెచ్ఎం నర్సింహులు అన్నారు. మండల కేంద్రంలో శనివారం బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి బడిబయటి పిల్లలను బడిలో చేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు ఫ్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 10జీపీఏ సాధించిన విద్యార్థ్ధులు ఉన్నారని తల్లిదండ్రులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమం ముందుకు సాగిస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అందుబాటులోకి వచ్చిందని విద్యార్థులను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శివరాజ్, ఉపాధ్యాయులు దీప, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
ఉట్కూర్,జూన్ 4:బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ఉట్కూర్, నిడుగుర్తి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య హాజరై మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రవికుమార్, తిప్పన్న, లక్ష్మారెడ్డి, సీఆర్పీ భీమన్న పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద జూన్ 4: మండంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేశ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో తిరిగి పిల్లలను బడిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యం బువ్వ, పౌష్టికాహారంలో కోడిగుడ్డు, పాలు, పండ్లు అందిస్తున్నదని, వీటితోపాటు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నర్సిరెడ్డి, , రాంరెడ్డి, వెంకటప్ప, అంగన్వాడీ టీచర్ సుధాజైపాల్రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.