అన్నపూర్ణ భోజనం అన్నార్థుల కడుపు నింపుతున్నది. ఎంపీగా ఉన్న సమయంలో 2013లో కేసీఆర్ తన నిధుల నుంచి మహబూబ్నగర్ జనరల్ దవాఖాన ఆవరణలో భోజనా మృతశాలను ప్రారంభించారు. ఇక్కడ రూ.5కే రుచికరమైన భోజనం లభ్య మవుతున్నది. వేడి వేడి అన్నంతోపాటు పప్పు, ఏదైన కూరగాయ, చట్నీ, సాంబర్తో భోజనం వడ్డిస్తున్నారు. దీంతో నేటి వరకు నిరంతరాయంగా కొనసాగుతున్నది. రోగులు, వారి వెంట వచ్చే బంధువులు, సహాయకులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. తమ ఆకలిని తీరుస్తున్న సీఎం కేసీఆర్కు పలువురు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
– మహబూబ్నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మా అమ్మ రెండు వారాల కిందట ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో కాలు విరిగింది. చికిత్స కోసం నేను మా అమ్మను తీసుకొని మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానకు వచ్చా. వారం రోజుల కిందట ఆమె కాలుకు శస్త్రచికిత్స కాగా.. ఇప్పుడు వైద్య సేవలు పొందుతున్నది. రోగి బంధువులకు భోజనానికి ఇబ్బంది లేదు. ప్రభుత్వం కేవలం రూ.5కే భోజనం అందిస్తున్నది. నేను రెండు వారాలుగా ఇక్కడే తింటున్నా. బయట భోజనం చేస్తే పూటకు రూ.80 దాకా ఖర్చయ్యేది. ఇక్కడ మాత్రం తక్కువ ఖర్చుకే వేడివేడి అన్నం, పప్పు, కూర, సాంబార్, చట్నీ అందిస్తున్నారు. రుచికరమైన భోజనం మా లాంటి ఎందరో కడుపులు నింపుతున్నది. సర్కార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
మహబూబ్నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా రోగులంతా వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు వచ్చేవారు. వందలాది మంది రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడేవారు. చాలా మంది నిరుపేదలు హోటళ్లలో భోజనం చేసేందుకు డబ్బులు లేక అవస్తలు పడేవారు. ఇదంతా తెలుసుకున్న అప్పటి మహబూబ్నగర్ ఎంపీ, ఇప్పటి సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు.
2013లో కేసీఆర్ తన ఎంపీ లాడ్స్ నుంచి ప్రత్యేకంగా రూ.10 లక్షలు విడుదల చేసి మహబూబ్నగర్ జిల్లా దవాఖాన ఆవరణలో రోగులు, వారి బంధువులు, సహాయకుల కోసం భోజనామృతశాల పేరిట ఓ హాల్ నిర్మించారు. దవాఖానకు వచ్చే వారికి భోజనామృతశాలలో కేవలం రూ.5కే భోజనం అందేలా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు భోజనామృతశాల నిరంతరాయంగా నడుస్తున్నది. ఈ భోజనశాలలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూ.5కే అన్నం, పప్పు, కూరగాయ, చట్నీ, సాంబర్ అందిస్తున్నారు. వేడివేడిగా భోజనం పెట్టడంతో రోగులు, వారి వెంట వచ్చే బంధువులు, సహాయకులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. వీరితోపాటు పట్టణానికి చెందిన నిరుపేదలు సైతం ఇక్కడ నిత్యం రూ.5 భోజనం ద్వారా కడుపు నింపుకొంటున్నారు.
నిత్యం సుమారు 400 మంది వరకు భోజనం చేస్తున్నారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మెరుగైన వైద్య సేవలతోపాటు అత్యాధునిక వైద్యం అందిస్తున్నందున ఉమ్మడి జిల్లా నుంచి రోగులు నిత్యం ఇక్కడికి వస్తున్నారు. రూ.లక్షలు విలువ చేసే అత్యాధునిక వైద్యం సైతం ఇక్కడ ఉచితంగా లభిస్తోందని.. తమకు కేవలం రూ.5 భోజనం లభిస్తోందని రోగులు, వారి బంధువులు, సహాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ నిరంతరం పేదల గురించే ఆలోచిస్తారు. 2013లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. ఆ సమయంలో ఆయన మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి జిల్లా దవాఖానలో పేదలకు భోజనం తక్కువ ధరలో అందించాలన్నఆలోచనతో కేసీఆర్ తన ఎంపీ లాడ్స్తో భోజనామృతశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నిర్మించిన హాల్లోనే లక్షలాది మంది నిరుపేదలు, రోగులు, వారి బంధువులకు మధ్యాహ్న భోజనం చేశారు. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అధునాతన వైద్య సేవలు స్థానికంగానే అందుతుండడంతో ఉమ్మడి జిల్లా ప్రజలంతా మహబూబ్నగర్ దవాఖానకు వస్తున్నారు. వారందరికీ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా నిలిచి రూ.5కే భోజనం అందిస్తున్నారు.
– వి.శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
మాలాంటి నిరుపేదలు ప్రైవేటు దవాఖానల్లో వైద్యం పొందలేకే ప్రభుత్వ దవాఖానకు వస్తున్నాం. మా నాన్న ఆరోగ్యం బాగోలేక మా అమ్మతో కలిసి మూడు రోజుల కిందట పెద్ద దవాఖానకు వచ్చాం. వైద్యం ఉచితంగా అందుతున్నా భోజనం ఎలా అనిఆలోచించాం. భోజనామృతశాలలో రూ.5 భోజనం పెడుతున్నారని మా పక్కన ఉన్న రోగి బంధువు చెప్పారు. దీంతో మాకు మధ్యాహ్నం వేళ భోజనానికి ఇబ్బందులు తప్పాయి. నేను, మా అమ్మ ఇక్కడే భోజనం చేస్తున్నాం. నాన్న దవాఖానలో అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఆయనకు అక్కడే భోజనం లభిస్తున్నది. మా లాంటి వారికి ఈ అన్నపూర్ణ పథకం వరం లాంటిది. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పుట్టపాగ శ్రీను, ఎత్తం, కోడేరు మండలం, నాగర్కర్నూల్ జిల్లా
మా పాపకు ఆరోగ్యం బాగా లేకుంటే వైద్యం కోసం నా భార్యతో కలిసి మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు వచ్చాం. నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. మొదటి రోజు హోటల్లో భోజనం చేశాం. మరుసటి రోజు నుంచి దవాఖాన ఆవరణలోనే అన్నపూర్ణ పథకం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనశాలలో రూ.5 భోజనం చేస్తున్నాం. మాలాంటి వాళ్లెందరో నిత్యం దవాఖానకు వస్తారు. వారందరికీ ప్రభుత్వం కేవలం రూ.5కే భోజనం అందించడం చాలా గొప్ప విషయం.
కిడ్నీలో రాళ్లున్నాయని చికిత్స కోసం పది రోజుల కిందట మహబూబ్నగర్ జిల్లా ద వాఖానకు వచ్చా. ఇప్పుడు నాకు వైద్యం అందుతున్నది. నాతోపాటు కుటుంబ సభ్యులు ము గ్గురు వచ్చారు. అందరం బయట తింటే ఎక్కువ ఖర్చు అ వుతుంది. అందుకే ప్రభుత్వం రూ.5కే అందించే అన్నపూర్ణ భోజనం చేస్తున్నాం. ప్రభుత్వం మా అందరి ఆకలిని తీరుస్తున్నది. దవాఖానలో నే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. ఉ దయం అల్పాహారం, రాత్రి భోజనం సత్యసాయి సేవా సమితి వాళ్లు అందిస్తున్నారు. ఆర్థికంగా భారం కాకుండానే వైద్యసేవలు పొందే అవకాశం లభించింది.
– వెంకటమ్మ, సల్కర్ పేట, బిజినేపల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా
మా గ్రామానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్ర భుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడం చాలా సంతోషం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గ తంలో ఏ ప్రభుత్వాలూ ఇం డ్లు ఇవ్వలేదు. పేదల సొం తింటి కలను సాకారం చే సిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. అర్హులకు ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– మంచాల కృష్ణయ్య, సర్పంచ్
ముఖ్యమంత్రి కే సీఆర్ పేదలకు దేవుడిలా మారాడు. కు లమతాలు, పార్టీలకతీతంగా అర్హులకు డబుల్ బెడ్రూం ఇం డ్లు నిర్మించడం చా లా సంతోషం. గత ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్న పేదలు ఇండ్ల బిల్లులు సరిగా రాక అప్పుల పాలయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఉచితంగా కట్టించడం గొప్ప విషయం.
– అభిమన్యురెడ్డి, ఎంపీటీసీ
నాకు ఆరోగ్యం బాగోలేక మహబూబ్నగర్ జ నరల్ దవాఖానకు వచ్చాను. వైద్య సేవలు పొంది న తర్వాత మా ఊరికి వెళ్తున్న క్రమంలో భోజనామృతశాల వద్ద రూ.5 భోజనం పెడుతున్నారని తెలిసి వెళ్లాను. వనపర్తికి వెళ్లే లోపు ఆకలి అవుతుందని
రూ.5 భోజనం చేశాను. చాలా బాగుం ది. దవాఖానకు వచ్చే రోగుల కోసం ప్రభుత్వమే భోజన సదుపాయం కల్పించడం చాలా గొప్ప విషయం. దవాఖానలోకి వచ్చే వారందిరకీ అన్నపూర్ణ పథకం గొప్ప వరం.
– బలరాం, వనపర్తి