నవాబ్పేట, మే 21 : గ్రామాల్లో నిర్వహించే బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని రేకులచౌడాపూర్, కిషన్గూడ గ్రామాల్లో శనివారం నిర్వహించిన బొడ్రాయి, మైసమ్మ, పోచమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలకు ఎమ్మెల్యే ము ఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, అభిమన్యురెడ్డి, సర్పంచులు సురేందర్, నిర్మల మ్మ, సత్యం, గోపాల్గౌడ్, కృష్ణయ్య, ఎంపీటీసీ రాధాకృష్ణ, డీసీఎంఎస్ మాజీ వైస్చైర్మన్ రాంప్రసాద్, మాజీ ఎంపీపీ శీనయ్య, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, మెండె లక్ష్మయ్య, నవనీతరావు, కృష్ణగౌడ్, శ్రీను, బీఆర్గౌడ్, చెన్నయ్య, నరేశ్, వెంకటయ్య, అంజయ్య పాల్గొన్నారు.
రాజాపూర్, మే 21 : దైవచింతనతో మా నసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఈద్గాన్పల్లిలో నిర్వహించిన బొడ్రాయి, కోటమైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సర్పంచ్ అలివేలు, గోవర్దన్రెడ్డి, నరేందర్రె డ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.