కోయిలకొండ, మే 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ శశికళాభీంరెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఐదోవిడుత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని కోరారు. కాగా, గ్రామాల్లో వందశాతం వ్యక్తిగత మ రుగుదొడ్లు నిర్మించినా కొందరు బహిర్భూమికి వెళ్తున్నారని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. బహిర్భూమికి వెళ్లడంవల్ల ఏర్పడే అనర్థాలను ప్రజలకు వివరించి వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకునేలా చూడాలని సూచించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి మధుసూదన్గౌడ్, తాసిల్దార్ ప్రేమ్రాజ్, ఏవో రాంపాల్, ఎంపీవో నసీర్అహ్మద్, ఏఈలు ఇసాక్, గణేశ్ తదితరులు ఉన్నారు.
పల్లెప్రగతిపై నిర్లక్ష్యం వద్దు
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఎంపీపీ సుశీల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 20నుంచి ప్రారంభంకానున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, వివిధ గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
సమస్యలను పరిష్కరించాలి
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బాలరాజు కోరారు. మండలకేంద్రంలో బుధవారం పల్లెప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీవో సుదర్శన్ ఉన్నారు.