బాలానగర్, మే 17 : వేసవిలో మండుతున్న ఎండలకు దప్పిక ఎక్కువవుతున్నది. ప్రయాణం చేసేవారు దాహం తీర్చుకునేందుకు అన్ని సందర్భాల్లో అల్లాడుతారు. ము ఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి చెప్పలేనివి కావు. ఇలాంటి అవస్థలు ప్రజలకు, ప్రయాణిలకు, వయస్సు మళ్లి న వారికి కలిగించొద్దనే ఉద్దేశంతో పలువురు వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ కారణం గా రెండేండ్లుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నెల రోజులుగా మండలం, గ్రామాల్లో పలు చోట్ల చలివేంద్రాల ఏర్పాటుకు పలువురు ముందుకొస్తున్నారు. ప్ర ధాన కూడళ్లలు, బస్స్టాప్లు, రహదారి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు పలువురి దాహం తీరుస్తున్నాయి. అందుబాటులో చలివేంద్రాలు ఉండడంతో పలు గ్రా మాల్లో చల్లని నీటిని కోసం ప్రజలు వెతకాల్సిన పరిస్థితి తప్పింది.
పంచాయతీల ఆధ్వర్యంలో..
చలివేంద్రాల ఏర్పాటులో గ్రామ పంచాయతీలు ముం దున్నాయి. మండలకేంద్రంలోని బస్స్టాప్, తాసిల్దార్ కా ర్యాలయం వద్ద, మండలంలోని పెద్దాయపల్లి, గుండేడ్, నే రళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, బోడగుట్టతండా, ఉడిత్యాల, తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి. మండలకేంద్రానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు.
వేసవికాలం కావడంతో దాహం వేస్తున్నది. ఈక్రమం లో గ్రామ పంచాయతీ వారు పంచాయతీల వద్ద, బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై చలివేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయానికి నిత్యం వచ్చే ప్రజ ల కోసం రెవెన్యూ సిబ్బంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. ఇంకా పలు గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎండకాలంలో దప్పిక తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగపడుతున్నాయి.
దాహం తీరుస్తున్నం
మండలకేంద్రానికి నిత్యం పెద్ద సం ఖ్యలో ప్రజలు, బాటసారు లు చాలా దూరం నుంచి వస్తున్నారు. వారు దాహం తీర్చుకునేందుకు నీరు అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే పాలకవర్గ సహకారంతో పంచాయతీ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశాం. వివిధ తండాల నుంచి వచ్చే ప్రజలు దప్పిక తీర్చేందుకు ఇది ఉపయోగపడడం ఆనందంగా ఉంది. బాటసారులకు నీళ్లుపోయడం సంతోషంగా ఉంది.
– గోపీనాయక్, సర్పంచ్ వాయిల్కుంటతండా