బాలానగర్, మే 15 : కోడి ధరలు కొండెక్కి కూర్చున్నా యి. వాస్తవానికి ఎండ కాలంలో చికెన్ ధరలు తగ్గు ముఖం పడుతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు చికెన్ కొని తినే పరిస్థితి కనిపించడం లేదు. 40 రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300. ఫిబ్రవరి మొదటి వారంలో కిలో ధర రూ.170 నుంచి రూ.190 ఉండగా, ప్రస్తుతం రూ.300 ఉంది. ధరలు మరింతంగా పెరిగే అవకాశం ఉందని చికెన్ షాపుల నిర్వాహకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు పెరుగుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్, శుభకార్యాలు ఉండడంతో చికెన్కు డిమాండ్ పెరిగింది.
బ్రాయిలర్ కోళ్ల వైపే మొగ్గు..
లేయర్ కోళ్ల కన్నా ప్రజలు బ్రాయిలర్ కోళ్లంటేనే ఎక్కువ ఇష్టంగా తింటారు. అయితే వేసవి కాలంలో 35 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత్త నమోదైతే బ్రాయిలర్ కోళ్లు మరణించడమో లేక రోగాలు రావడమో జరుగుతున్నది. దీంతో ఎక్కువ రోజులు కోళ్లను ఫారాల్లో ఉంచకుండా రైతులు తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. నేపథ్యంలో కోడి మాంసం ధరలు తగ్గాంచాల్సి ఉండగా రోజురోజుకూ పెరుగడం గమనార్హం.
గ్రామాల్లో మరింత భారం..
పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ మరింత ప్రియంగా మారింది. పట్ణణంలో కేజీ చికెన్ రూ.300 విక్రయిస్తుండగా, గ్రామాల్లో రూ.330 వరకు విక్రయిస్తున్నారు. పట్టణంలో ఒక కోడి గుడ్డు ధర రూ.5 ఉండగా, గ్రామాల్లో రూ.6 వరకు అమ్ముతున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు పైపైకి..
నెల రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సన్ ఫ్లవర్ నూనె కేజీ ప్యాకెట్ ధర రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.200 నుంచి రూ.220 వరకు ధర పలుకుతున్నది. ఉప్పు, పప్పు, దినుసుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగి సామాన్యులకు పెను భారంగా మారాయి. కూరగాయాల ధరలు కూడా కేజీ రూ.50 లకు పైగానే పలుకుతున్నాయి. టమాట కేజీ రూ.50 చేరింది. మటన్ కిలో ధర రూ.650 ఉంది. అదేవిధంగా నాటు కోడి మాంసం ధరలు కూడా మటన్కు పోటీగా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
చికెన్ విక్రయాలు తగ్గాయి
కోడి మాంసం ధర లు పెరగడంతో గతం లో కిలో చికెన్ కొనుగోలు చే సే వారు ప్రస్తుతం అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నా రు. సాధారణ రోజుల్లో కోడి మాంసం విక్రయాలు అంతం త మాత్రంగానే కొనసాగుతున్నాయి. వేసవికాలం ప్రా రంభం కావడంతో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి.
– నర్సింగ్రావు, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, గౌతాపూర్
చికెన్ జోలికి పోవడం లేదు
చికెన్ తినాలంటే చుక్కలు కనపడుతున్నా యి. ఎన్నడూ లేనంతంగా ధ రలు పెరిగాయి. దీంతో కొంత కాలంగా చికెన్కు దూరమ య్యాం. కేవలం కూరగాయా లు మాత్రమే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికెన్ ధరలు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి, గతంలో ఎన్నడూ కూడా ఇంత ధర లేదు. వేసవిలో ధరలు తగ్గుతాయనుకుంటే మరింత పెం చుతున్నారు.
-రమేశ్నాయక్, యువకుడు, బాలానగర్