వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నూతన స మీకృత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుతుందా.. ? అని అడిగి తెలుసుకోవాలని సూచించారు. పైప్లైన్ విస్తరణ, నల్లా కనెక్షన్లు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో తాగునీటి ఎద్దడికి చెక్ పడిందన్నారు. పట్టణంలో 1.14 కిలోమీటర్ల పైప్లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని మున్సిపల్ ఇంజినీర్ తెలిపారు. దీనికి మంత్రి పనుల్లో వేగం పెం చాలని ఆదేశించారు.
పట్టణంలో మున్సిపల్ కమిషనర్ పర్యటించి నీటి సరఫరాను పరిశీలించాలన్నారు. అప్పాయిపల్లి, నర్సింగాయపల్లి వద్ద 650 డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి నివేదిక కలెక్టర్కు అందించాలని మేఘూరెడ్డికి సూచించారు. రాజనగరంలో ట్యాంకులు పరిశీలించాలని, చందాపూర్, దత్తాయపల్లి గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు హైవోల్టేజ్తో కాలిపోతున్నాయని, వాటి ని పరిశీలించాలని సూచించారు.పెబ్బేరులో జనాభా మేరకు నీటి సరఫరా జరగాలని, గొల్లపల్లిలో నిర్మించిన రిజర్వాయర్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 300 కోట్లతో చేపట్టిన రిజర్వాయ ర్ పనులు జూలై 30లోపు పనులు పూర్తి చేయాలన్నా రు. వనపర్తి- జడ్చర్ల రోడ్డు పనులు ఈనెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వర్టులు, బ్రిడ్జి పనులు ఇతర సమస్యలు ఉంటే వాటిని అధిగమించాలని సూచించారు. ఫేజ్-1, ఫేజ్-2 రోడ్డు పను లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మెడికల్ కళాశా ల పనుల్లో జాప్యం లేకుండా ముగించాలన్నారు. జిల్లా లో 5 సబ్స్టేషన్ పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో విద్యత్ స్తంభాలు అవసరమైన చోట ఏర్పాటు చేయాలన్నారు.
మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ ఇంజినీర్లపై పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప నులు సక్రమంగా ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతు నెలకు రూ.30 చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు విద్యుత్ ఎస్ఈ మంత్రికి వివరించారు. జిల్లా కేంద్రంలో టౌన్ హాల్, గిరిజన భవనం ప నులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. పాన్గల్లో మైనార్టీ కమిటీ హాల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని జెడ్పీ కోఆప్షన్ మెంబర్ కోరారు. అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ జిల్లాలో మిషన్ భగీరథ పనులు సత్వరం పూర్తి చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రికి వివరించారు. ప్రతి ఇంటికీ జలా లు అందించేలా, గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు పర్యవేక్షించేందుకు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, వననర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాద వ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి, మే 14 : అనారోగ్యం బారిన పడి మెరుగై న వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండగా ఉంటుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 85 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదలై న రూ.24,68,500 విలువైన చెక్కులను మంత్రి పంపి ణీ చేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి అల్పాహా రం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కు రుమూర్తి యాదవ్, మండలాధ్యక్షుడు మాణిక్యం, నాయకులు రాము, రహీం, జోహెబ్, శివ, శరవంద, పరంజ్యోతి, వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.