ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా చురుకుగా కొనసాగుతున్నది. ఊరూవాడ ఏకమై పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పల్లెల్లో పిచ్చిమొక్కలు, శిథిల భవనాలు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగింపు తదితర పనులను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
జడ్చర్ల, జూలై 3 : జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్, నెక్కొండ, గంగాపూర్, లింగంపేట గ్రామాల్లో శనివారం జెడ్పీ సీఈవో జ్యోతి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచ్ ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు. అదేవిధంగా కిష్టారం, మాచారం, కుర్వగడ్డపల్లి, లింగంపేట తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో స్వరూప, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీవో జగదీశ్, ఏపీవో విజయభాస్కర్, సర్పంచులు నర్సింహులు, రవీందర్, సుందర్రెడ్డి, హైమావతి, ప్రభాకర్రెడ్డి, చంద్రకళ, స్వరూప, రాజేశ్వర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఉలుగొండ సువర్ణ తదితరులు ఉన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జూలై 3 : మండలంలోని బల్సుపల్లి, హజిలాపూర్, బొల్లారం, కౌకుంట్ల తదితర గ్రామా ల్లో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు స్వప్నకిషన్రావు, సరోజ, విశ్వనాథ్, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 3 : మండలంలోని కొత్లాబాద్, మల్లాపూర్ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి మధుసూదన్గౌడ్ పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, సర్పంచ్ చరితమ్మ, ఎంపీటీసీ సత్యయ్యగౌడ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూలై 3 : మండలంలోని బోయిన్పల్లి, మిడ్జిల్, దోనూర్, వస్పుల్, సింగందొడ్డి తఇదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి యాదయ్య పరిశీలించారు. పల్లెప్రగతిలో భాగంగా ఆయా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, సర్పంచులు నారాయణరెడ్డి, రాధికారెడ్డి, జంగారెడ్డి, మధుసూదన్రెడ్డి, మంగమ్మ, సంయుక్తారాణి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జూలై 3 : మండలంలోని పోతులమడుగు, తాటికొండ తదితర గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి సా యిబాబా పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్ట న్న, ఎంపీవో విజయకుమార్, సర్పంచులు కమలమ్మ, సా యికుమార్, ఎంపీటీసీ ఊశన్న, సాయిలు, వెంకటేశ్వరమ్మ, కార్యదర్శులు వెంకటేశ్వరమ్మ, రాజేశ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూలై 3 : మండలంలోని గౌతాపూర్, బోడజానంపేట, పెద్దరేవల్లి, బోడగుట్టతండాల్లో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీదేవి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అదేవిధంగా చిన్నరేవల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మీచంద్రమౌళి గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. వీరన్నపల్లిలో మురుగు కాల్వల్లో చెత్తాచెదారం, కంపచెట్లను తొలగించినట్లు సర్పంచ్ పట్నం రాజు తెలిపారు. పెద్దాయపల్లిలో సర్పంచ్ శంకర్ బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమాల్లో ఏపీవో రాజశేఖర్, సర్పంచులు రమేశ్, చంద్రకళాబాలయ్య, రమేశ్నాయక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జూలై 3 : మండలంలోని ముదిరెడ్డిపల్లి, మల్లెపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో లక్ష్మీదేవి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకట్రాములు, సర్పంచులు పెంటయ్య, శ్యామ్బాయి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూలై 3 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా హన్వాడ, వేపూర్, ఇబ్రహీంబాద్ గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్ల తొలగింపు పనులు చేపట్టారు. అలాగే పలు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, మి షన్ భగీరథ ఏఈ యాదయ్య, సర్పంచులు రేవతి, వసంత, లక్ష్మీనారాయణ, వెంకన్న, సత్యమ్మ, వెంకటమ్మ, టీఆర్ఎస్ నాయకులు సత్యం, రమణారెడ్డి, శ్రీనివాసులు, యాదయ్య, రాఘవులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జూలై 3 : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ కోరారు. మండలంలోని మొకర్లాబాద్, ముం దరితండా, అన్నారెడ్డిపల్లి తండాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమం లో ఎంపీవో శంకర్నాయక్, సర్పంచులు బామిలీబాయి, రక్షితారెడ్డి, నీలేశ్నాయక్, ఎంపీటీసీ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.