నారాయణపేట టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో సీతారాముని కల్యాణ వేడుకలు కనులపండువగా జరిగాయి. మూలహనుమాన్ దేవాలయం దగ్గర హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీరాముని జన్మనక్షత్రం ప్రకారం ఆలయ అర్చకులు శ్రీపతి, రఘుప్రేమ్జోషి మంత్రోచ్ఛారణ లు, మేళతాళాలు, భక్తజన సం దోహం మధ్య సీతారాము ల కల్యాణం వైభవంగా నిర్వ హించారు. అనంతరం ఆల యం వద్ద సీతారాముల పట్టాభిషేకానికి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. అదేవిధంగా శక్తిపీఠం ఆధ్వర్యంలో సీతారాముల క ల్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టణంలోని బ్రాహ్మణవాడి రామాలయంలో శ్రీరాముడి డోలారోహణం నిర్వహించారు. అం తకు ముందు ఆలయఅర్చకులు రాఘవేంద్రజ్యోషి స్వా మివారి మూలవిరాట్టు విగ్రహాలకు పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
నారాయణపేటరూరల్, ఏప్రిల్10 : మండల పరిధిలోని జాజాపూర్, సింగారం, శేర్నపల్లి, అప్పక్పల్లి, అప్పిరెడ్డిపల్లి, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సింగారం గ్రామంలో పల్లకీసేవ నిర్వహించి అన్నదానం చేశారు. జాజాపూర్లో శ్రీరామయూత్ ఆధ్వర్యంలో రాముని చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. అప్పిరెడ్డిపల్లి శ్రీరామకొండపై నిర్వహించిన సీతారాముల కల్యాణానికి పేట అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బిజ్వారం పరశ్రీస్వామి, శ్రీగిరిపీఠం శివస్వామి, సీఐ శ్రీకాంత్రెడ్డి, నాయకులు కుర్మన్న, రఘువీర్యాదవ్, సత్యయాదవ్లు పాల్గొన్నారు. తిర్మల్దేవునిపల్లిలో తిర్మలనాథస్వామికి పేట మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్,పేట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోస్గిలో..
కోస్గి, ఏప్రిల్ 10 : కోస్గి పట్టణంలోని రామాలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే తొగాపూర్, గుండుమాల్ గ్రామాలలో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయకమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్ , ఏప్రిల్ 10 : మండలంలో సీతారాముల కల్యా ణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరికల్లో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వందలాదిమంది భక్తుల మధ్య రాములోరి కల్యాణాన్ని జరిపించారు. ఈ కల్యాణోత్సవానికి అధికారికంగా తాసిల్దార్ కార్యాలయం, సీఐ కార్యాలయం, సర్పంచ్ ఇంటి నుంచి తలంబ్రాలను ఉరేగింపుగా తీసుకొచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కూడా తలంబ్రాలను పంపించారు. అనంతరం యువకులు జైశ్రీరాం అని నినాదాలు చేస్తు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలంలోని తీలేరులో ప్రశాంత్ కుమార్రెడ్డి దంపతులు, పల్లెగడ్డలో గ్రామస్తుల ఆధ్వర్యం లో సీతారాములకు కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద ఏప్రిల్ 10 : మండల కేంద్రంతోపాటు సజనాపూర్, క్యాతన్పల్లి గ్రామాలలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దామరగిద్ద, క్యాతన్ పల్లి రామాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సజనాపూర్లో భక్తులకు పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షు డు పుట్టి ఈదప్ప దంపతులు, అవుటి శశిధర్ దంపతులు, చందుజమన్ దంపతులు, రఘువీర్ దంపతులు, సర్పంచ్ కనకప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మద్దూరులో..
మద్దూర్, ఏప్రిల్ 10 : మండలంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నిగ్రామాల్లో భక్తులు సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మక్తల్లో..
మక్తల్ టౌన్, ఏప్రిల్ 10 : పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం రాంలీలా మైదానంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్రెడ్డి, జిల్లా రైతుబంధు నాయకురాలు చిట్టెం సుచరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం ఉడిపిపీఠం ప్రచారకర్త రాఘవేంద్రస్వామి సీతారాముల కల్యాణోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కొండయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పావని, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పీ నర్సింహాగౌడ్, శ్రీనివాస్గుప్త్తా, సీఐ సీతయ్య, ఎస్సై రాములు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
దత్తాత్రేయ ఆలయంలో..
మక్తల్ రూరల్, ఏప్రిల్10 : కర్ని గ్రామంలోని మారుతి దత్తాత్రేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, ఏప్రిల్ 10 : శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతపేట బాల హనుమాన్ ఆల యం, పగిడిమర్రి క్రాస్రోడ్డులోని శ్రీ దత్త త్రిలింగేశ్వరామాలయం, బిజ్వారం, మొగ్దుంపూర్, ఓబ్లాపూర్, పులిమామిడి గ్రామాలలో కూడా సీతారాముల కల్యాణమహోత్సవాలు నిర్వహించారు. బిజ్వారంలో రథోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, మాజీవిండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, ఆలయ ధర్మకర్త దత్తయ్య రాజయోగి, కమిటీ సభ్యులు పద్మమ్మ, విజయరామరాజు, శివరామరాజు, ప్రతాప్, భగవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్వలో..
నర్వ, ఏప్రిల్ 10 : మండల పరిధిలోని నర్వ, లంకాల, ఉందేకోడ్, జక్కన్నపల్లి, కుమార్లింగంపల్లి గ్రామాలలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ, ఆంజనేయస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణం వేదమంతోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండ్ల చిన్న య్య, నెల్లూరి వెంకటయ్య, చదువు కృష్ణ్ణారెడ్డి, నాగిరెడ్డి, కేశవులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్లో…
మాగనూర్ ఏప్రిల్ 10 : మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాములు కల్యాణం మొదటిసారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలమ్మ, గ్రామ సర్పంచ్ రాజు, గ్రామస్తులు కృష్ణయ్య, ఆంజనేయులు, సత్యప్ప, నరేశ్, వాకిటి శ్రీను, పూజారి కృష్ణయ్య, రవి, జైపాల్రెడ్డి, మారెప్ప, ఆనంద్గౌడ్ గ్రా మస్తులు పాల్గొన్నారు.