వనపర్తి, ఏప్రిల్ 5 : పేదల పాలిట పెన్నిధి, నవ భా రత నిర్మాణంలో నాలుగు దశాబ్దాలుగా అవిరాళ కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి తెలిపారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల ఆధ్వర్యంలో మంగళవా రం జిల్లా కేం ద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడు తూ జగ్జీవన్రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారని, పాఠశాల స్థాయి నుంచే బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమం చేపట్టారన్నారు. ప్రాథమిక స్థాయిలో స్వేచ్ఛా సమానత్వం కోసం పాటుపడ్డారన్నారు. దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి పలు పదవులు అధిరోహించారన్నారు. అతిచిన్న వయస్సులో రక్షణ, కార్మిక, వ్యవపాయం, ఉప ప్రధాని పదవి చేపట్టి చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే కులవివక్షపై పోరాడిన మహానుభావుడు జగ్జీవన్రామ్ అని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన వ్యక్తి అని అన్నారు. అలాంటి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్ నారాయణ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారిణి నుశిత, దళిత సంఘం నాయకులు వెంకటేశ్, పరంజ్యోతి, అధికారులు పాల్గొన్నారు.
అమ్మ చెరువు, నల్ల చెరువు, తాళ్లచెరువు కట్ట పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అమ్మ చెరువు కట్ట పనులు, నల్ల చెరువు నుంచి అమ్మ చెరువుకు వచ్చే వా గు వరకు చెక్డ్యాం నిర్మాణ పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. జూన్ 2వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని, రాష్ట్ర అవతరణ వేడుకలను చెరువు కట్టపై నిర్వహించుకుందామని మంత్రి సూచించారు.
వనపర్తి టౌన్, ఏప్రిల్ 5 : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల మొదటి అంతస్తు భవన నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తానని మంత్రి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో మాట్లాడి రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పింఛన్ వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో తమ సంఘం భవన నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి నిరంజన్రెడ్డి ఒక్కరే అని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి ప త్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు ఆర్ఎస్ఎన్ గౌడ్, ఏఆర్సీ రెడ్డి, రాఘవరెడ్డి, సహదేవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.