నాగర్కర్నూల్, డిసెంబర్ 21 : గిరక తాటి, ఈత మొక్కలను పెంచాలని, ఇందుకోసం హరితహారంలో ఈ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మె డికల్ కళాశాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి ఆబ్కారీ శాఖపై మంత్రి సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీర అనేది ఔషధ గుణాలున్న పానీయమన్నారు. స్వచ్ఛమై న నీరాతో గీత కార్మికులు ఉపాధి పొందాలని సూచించారు. దీన్ని ప్రజలకు అందించడమే కాకుండా హరితహారంలో మొక్కలు పెంచినవారు అవుతారన్నారు. ఐదెకరాల ప్రభుత్వ భూమి ఎక్కడైనా దొరికితే అందు లో ఈ గిరక తాటి, ఈత మొక్కలను పెంచాలన్నారు. నిరాను గీయాలన్నా, అమ్మాలన్నా.. గౌడ కులం వారే చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. దీంతో గ్రామాల్లో సొసైటీల్లో సభ్యులను నేర్చుకొని సంఖ్యను పెంచాలని సూచించారు. ఏ ఊరి గీత కార్మికులు అదే ఊరిలో వ్యాపారం చేసుకొని బతికేలా చూడాలన్నారు.
గౌడ కులస్తుల ఆరాధ్యుడు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇది ఎం తో గర్వకారణమని పేర్కొన్నారు. గీత కార్మికులు ప్ర మాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా అందజేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది సాధారణ మ రణాలకు సైతం ఇచ్చేలా కృషి చేస్తామని వివరించారు. గ్రా మాల్లో ఆబ్కారీ అధికారుల వేధింపులు లేవని, మా మూళ్లు అడగడం సైతం లేదన్నారు. హైదరాబాద్లో రూ.12 కోట్లతో నీరా కేఫ్ను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో చారకొండ, నాగర్కర్నూల్లో సైతం నీరా కేఫ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెలరోజుల్లో గుడుంబాను పూర్తిగా అరికట్టి నాగర్కర్నూల్ జి ల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని అధికారులను ఆదేశించారు. గుడుంబా తయారు చేసోటోళ్ల ను.. ప్రోత్సహించే వారిని ఎవరినీ వదిలిపెట్టవద్దన్నా రు. అవసరమైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ జ క్కా రఘునందన్రెడ్డి, ఆబ్కారీశాఖ సూపరింటెండెం ట్ ఫయాజ్, సీఐ, ఎస్సైలు, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.