మక్తల్ టౌన్, డిసెంబర్18 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలన్న లక్ష్యంతో సీఎం కే సీఆర్ పంచాయతీలను అభివృద్ధి చే స్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివా రం పట్టణంలోని ఆయన నివాసం లో ప్రెస్మీట్లో మాట్లాడారు. మ క్తల్ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గం లో 53 పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు వి డుదల చేసిందన్నారు. మక్తల్ మం డలంలో 13, మాగనూర్లో 9, కృష్ణ 7, నర్వ 5, ఊట్కూర్ 9, ఆత్మకూర్ 2, అమరచింత 5, మదనాపురం 2, మరికల్ మండలం బుడ్డెకాన్తండాలో నూతన భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. జీపీకి రూ.20 లక్షల చొప్పున 53 భవనాలను నిర్మించేందుకు రూ.10.60 కోట్ల ను ప్రభుత్వం కేటాయిందన్నారు. సుందరంగా.. నాణ్యతగా ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పా రు. అన్ని గ్రామాల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదన లు సిద్ధం చేశామన్నారు. మక్తల్లో నూతన హంగులతో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి త్వరలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు.
మానవత్వాన్ని చాటిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వారిని ద వాఖానకు తరలించి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మానవత్వాన్ని చాటిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. వివరాల్లో… ఉదయం ఎమ్మె ల్యే చిట్టెం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వె ళ్తున్న క్రమంలో మక్తల్ సమీపంలో తిరుమలయ్య చెరువు కట్ట వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న వా రు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిని గమనించిన ఎమ్మెల్యే వాహనాన్ని నిలిపి వెంటనే గా యపడిన వారి వద్దకు వెళ్లి 108లో చికిత్స నిమి త్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు పంపించారు. బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.