మహబూబ్నగర్, డిసెంబర్ 14 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో శానిటేషన్, భద్రత, ఎలక్ట్రిసిటీ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలతో బుధవారం అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కలెక్టరేట్ పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయ భద్రత కోసం అవసరమైన సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ భద్రత, సెక్యూరిటీ గార్డుల నియామకానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సంబంధిత కమిటీకి సూచించారు.
జిల్లా కార్యాలయాలకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ మూర్తిని ఆదేశించారు. కలెక్టరేట్కు తాగునీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణకు సూచించారు. గార్డెన్, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రోజూ మొక్కలకు నీరందించి సంరక్షించాలని కోరారు. అలా గే జిల్లా కార్యాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం, సైబర్ సెక్యూరిటీ చూడాలని ఎన్ఐసీ మూర్తికి సూచించారు. కలెక్టరేట్లో క్యాంటిన్పై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ స్వామి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి మధుసూదన్గౌడ్, ఇన్చార్జి ఆర్డీవో ప్రేమ్రాజ్, ఏవో శ్రీనివాసులు ఉన్నారు.
సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 14 : సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మతగురువు పీర్హషీం జన్మదినం సందర్భంగా బుధవారం స్థానిక బాలు ర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు షఫీ, కౌన్సిలర్ షబ్బీర్, ముంజిమిల్, జహంగీర్ పాల్గొన్నారు.